రాజుగారి గదికి గ్రాఫిక్స్ దెబ్బ

లెక్క ప్రకారం నాగ్ నటిస్తున్న సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాలి. కానీ రాజుగారి గది-2 సినిమా ఆగస్ట్ లో రావడం లేదు. ఏకంగా ఈ సినిమాను అక్టోబర్ కు వాయిదా వేశారు. తాజా…

లెక్క ప్రకారం నాగ్ నటిస్తున్న సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాలి. కానీ రాజుగారి గది-2 సినిమా ఆగస్ట్ లో రావడం లేదు. ఏకంగా ఈ సినిమాను అక్టోబర్ కు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం గ్రాఫిక్ వర్క్ లో జాప్యం వల్లనే ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది.

నిజానికి రాజుగారి గది-2 షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. నాగ్ నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రిలీజ్ కాకముందే రాజుగారి గది-2 పూర్తయింది. ఆ విషయాన్ని నాగార్జునే వెల్లడించాడు. కాకపోతే రీ షూట్స్ కారణంగా మొన్నటివరకు డిలే అయింది. ఇప్పుడు గ్రాఫిక్స్ మూలంగా సినిమా విడుదల పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఎక్కువగా ఇన్ వాల్వ్ అవుతున్న నాగార్జున, రాజుగారి గది-2 విషయంలో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని రీ షూట్స్ పూర్తిచేసిన నాగ్, కథ ప్రకారం సినిమాలో గ్రాఫిక్స్ నిడివి పెంచితే బాగుంటుందని నిర్ణయించాడు. కాస్త ఆలస్యమైనా గ్రాఫిక్ వర్క్ తో సినిమాను విడుదల చేద్దామని దర్శక-నిర్మాతలకు సూచించాడు.

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది-2లో నాగ్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలకమైన పాత్రలో నాగ్ కాబోయే కోడలు సమంత కనిపించనుంది.