డేట్ మిస్సయింది..కాంపిటీషన్ పెరిగింది

బంగారం లాంటి జూలై 14 డేట్ ను మిస్సయింది గౌతమ్ నందా. వర్క్ ఫినిష్ కావడంలో ఆలస్యం కావడమే కారణం. జూలై 28 డేట్ గా ఫిక్స్ చేసుకుంది. కానీ తీరా చేస్తే ఇప్పుడు…

బంగారం లాంటి జూలై 14 డేట్ ను మిస్సయింది గౌతమ్ నందా. వర్క్ ఫినిష్ కావడంలో ఆలస్యం కావడమే కారణం. జూలై 28 డేట్ గా ఫిక్స్ చేసుకుంది. కానీ తీరా చేస్తే ఇప్పుడు కాస్త గట్టి కాంపిటీషన్ నే తగిలింది. కృష్ణ వంశీ డైరక్షన్ లో ముస్తాబయిన నక్షత్రం సినిమాకు 28 రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసారు.

సందీప్ కిషన్, రెజీనా, సాయి ధరమ్ తేజ వంటి కాస్త గట్టి స్టార్ కాస్టింగ్ నే వుంది. పైగా కృష్ణ వంశీ డైరక్టర్. సినిమా ఎలా వుంటుంది అన్నది తరువాతి సంగతి. ముందు ఓపెనింగ్స్ కు అయితే కాస్త అవకాశం వుంది. ఎందుకంటే ఆంధ్రలోని కోస్తా జిల్లాల్లో కృష్ణ వంశీ సినిమా అంటే కాస్త క్రేజ్ వుంది. అలాగే సాయి ధరమ్ తేజ అంటే మాస్ సెంటర్లకు కాస్త క్రేజ్ వుంటుంది.

అందువల్ల సినిమాల మధ్య పోటీ సంగతి ఎలా వున్నా, ఓపెనింగ్స్ ఎఫెక్ట్ కావడానికి అవకాశం వుంటుంది. అయితే గౌతమ్ నందకు ఇప్పటికే కొత్త బజ్ వచ్చింది. అది ఓ ప్లస్ పాయింట్. నక్షత్రం ఇంకా ఆ మేరకు బజ్ సంతరించుకోవాలి. పైగా చిరకాలం షూట్ జరుపుకొవడం వల్ల ఆ సినిమాపై జనాలకు పెద్దగా ఆసక్తి పెరగలేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు ప్రచారంతో బజ్ పెంచుకోవాల్సి వుంది.

మరోపక్క గౌతమ్ నందా వచ్చిన బజ్ తో సంతృప్తి చెందిపోయినట్లు కనిపిస్తోంది. పబ్లిసిటీపై అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.