మహేష్, ఎన్టీఆర్, బాలయ్య.. వెనక్కి తగ్గేది ఎవరు

సంక్రాంతికి కూడా ఇలా జరగలేదు. చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే పోటీపడ్డారు. కానీ దసరాకు మాత్రం ముగ్గురు పెద్ద హీరోలు బరిలోకి దిగుతున్నారు. ఈ విషయంలో ఎవరూ తగ్గకపోవడం విశేషం. Advertisement పూరిజగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ…

సంక్రాంతికి కూడా ఇలా జరగలేదు. చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే పోటీపడ్డారు. కానీ దసరాకు మాత్రం ముగ్గురు పెద్ద హీరోలు బరిలోకి దిగుతున్నారు. ఈ విషయంలో ఎవరూ తగ్గకపోవడం విశేషం.

పూరిజగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఒకసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత బాలకృష్ణ వెనక్కి తగ్గేది లేదు. సో.. ఇది ఫిక్స్.

అటు ఎన్టీఆర్ కూడా తన లేటెస్ట్ మూవీ జై లవకుశను సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలయ్య సినిమా కంటే వారం రోజుల ముందే అంటే సెప్టెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకొని 22కు పోస్ట్ పోన్ చేశారు.

మొన్నటివరకు వీళ్లిద్దరే. కానీ ఇప్పుడు మహేష్ బాబు కూడా వచ్చాడు. మహేష్ బాబు కూడా స్పైడర్ తో దసరాకు వస్తున్నామంటూ ఇప్పటికే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే స్పైడర్ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి నిర్ణయించారు. అంటే పైసా వసూల్ కంటే జస్ట్ 2 రోజులు ముందన్నమాట.

ఇలా 3 పెద్ద సినిమాలు వారం రోజుల గ్యాప్ లోనే థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. కచ్చితంగా థియేటర్ల సమస్య ఎదురవుతుంది. వసూళ్లపై కూడా ప్రభావం పడుతుంది. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.