నిఖిల్ కు మూడు కోట్ల రెమ్యూనిరేషన్

ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ వస్తున్న హీరో నిఖిల్ తొలి సారి మూడు కోట్ల రెమ్యూనిరేషన్ అందుకోబోతున్నాడు. ప్రస్తుతం కేశవ సినిమాను ఫినిష్ చేసాడు. ఆ తరువాత ఎకె ఎంటర్ టైన్ మెంట్స్…

ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ వస్తున్న హీరో నిఖిల్ తొలి సారి మూడు కోట్ల రెమ్యూనిరేషన్ అందుకోబోతున్నాడు. ప్రస్తుతం కేశవ సినిమాను ఫినిష్ చేసాడు. ఆ తరువాత ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ లో కిర్రాక్ పార్టీ రీమేక్ లో నటించబోతున్నాడు. ఇది పూర్తి కాగానే, గణితన్ తమిళ రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాను తమిళ నిర్మాతలే తెలుగులో నిర్మించబోతున్నారు.

ఈ సినిమా కోసం వాళ్లు నిఖిల్ కు మంచి ప్యాకేజ్ డీల్ ను ఆఫర్ చేసారు. మూడు కోట్ల రెమ్యూనిరేషన్ కిట్టుబాటు అయ్యేలా ఈ ప్యాకేజ్ డీల్ వుంటుందని వినికిడి. అంతకు ముందు ఎకె లో చేసే కిర్రాక్ పార్టీకి కూడా రెండు కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడు. మరి ఈ రెండింటి తరువాత దిల్ రాజు నిర్మాణంలో చేసే కార్తికేయ 2 సంగతి మాత్రం ఇంకా తెలియదు. మొత్తం మీద కోటి రూపాయిల దగ్గర స్టక్ అయిన నిఖిల్ పారితోషికం బాగానే మూవ్ అయింది ముందుకు.