​’​గురు​’​కు సీక్వెల్.. ఈసారి వేరే హీరో

వెంకటేష్-సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కిన గురు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ లేనప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం గురు సినిమాదే హవా. ఇప్పుడీ…

వెంకటేష్-సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కిన గురు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ లేనప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం గురు సినిమాదే హవా. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట దర్శకురాలు సుధా కొంగర. సినిమాకు కొనసాగింపుగా ఆమె ఇప్పటికే ఓ స్టోరీలైన్ కూడా అనుకున్నారు.

సీక్వెల్ లో ఎప్పుడైనా హీరో మారడు. హీరోయిన్లు, ఇతర తారాగణం మారినా హీరో మాత్రం అలాగే ఉంటాడు. కానీ గురు సీక్వెల్ కోసం వెంకీని పక్కనపెట్టారట. ఆ స్థానంలో రానాను తీసుకుంటున్నారట.  ఇప్పటికే అనుకున్న స్టోరీలైన్ ను రానాకు వినిపించారు సుధా కొంగర. ఆ కథ గురుకు సీక్వెల్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. కాకపోతే వెంకీ చేసిన పాత్రను రానాకు ఎలా కనెక్ట్ చేస్తారనేదే పెద్ద డౌట్.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో “నేనే రాజు నేనే మంత్రి” అనే సినిమా చేస్తున్నాడు రానా. మరోవైపు బాహుబలి-2 విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సుధా కొంగరతో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.