క్రిష్-వెంకీ కన్ ఫర్మ్ అంట

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా తరువాత డైరక్టర్ క్రిష్ చేయబోయే సినిమా వెంకీతోనే అంట. సాధారణంగా సినిమా సినిమాకు క్రిష్ గ్యాప్ తీసుకుంటారు. ఆ టైమ్ లో ముంబాయి వెళ్లి, ఏడ్ ఫిల్మ్ లు…

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా తరువాత డైరక్టర్ క్రిష్ చేయబోయే సినిమా వెంకీతోనే అంట. సాధారణంగా సినిమా సినిమాకు క్రిష్ గ్యాప్ తీసుకుంటారు. ఆ టైమ్ లో ముంబాయి వెళ్లి, ఏడ్ ఫిల్మ్ లు తీసుకుంటూ రిలాక్స్ అవుతారు. అయితే ఈసారి బహుశా అంత గ్యాప్ తీసుకోకపోవచ్చు.

గురు సినిమా ఫినిష్ చేసి వెంకీ రెడీగా వున్నారు. వెంకీకి నచ్చినట్లు తనకథను సెట్ చేయలేకపోతున్నారు డైరక్టర్ తిరుమల కిషోర్. అందువల్ల అయితే పూరి జగన్నాధ్, కాకుంటే క్రిష్ లతో సినిమా ప్రారంభించాల్సివుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల అనంతరం పరిస్థితి చూసి, వెంకీ క్రిష్ తోనే స్టార్ట్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

పైగా పూరి సినిమా బడ్జెట్ విషయంలో వెంకీకి, సురేష్ బాబుకు మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే క్రిష్ అయితే, తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇస్తాడు. అందుకే వెంకీ తరువాత సినిమా విషయంలో నిర్ణయాన్ని జస్ట్ వన్ వీక్ వెనక్కు తోసినట్లు తెలుస్తోంది.