దొంగచాటుగా బిర్యానీ తిన్న చిరు, రోజా

సినిమాల్లో హీరో హీరోయిన్లు అయినా, రాజకీయంగా వేరు వేరు మార్గాల్లో వున్నారు హీరో చిరంజీవి, హీరోయిన్ రోజా. ఒక దశలో రోజా అయితే చాలా ఘాటు విమర్శలే చేసారు చిరంజీవి పై. అలాంటిది ఒక్కసారిగా సాక్షి…

సినిమాల్లో హీరో హీరోయిన్లు అయినా, రాజకీయంగా వేరు వేరు మార్గాల్లో వున్నారు హీరో చిరంజీవి, హీరోయిన్ రోజా. ఒక దశలో రోజా అయితే చాలా ఘాటు విమర్శలే చేసారు చిరంజీవి పై. అలాంటిది ఒక్కసారిగా సాక్షి చానెల్ కోసం రోజా జర్నలిస్ట్ కమ్ ఏంకర్ గా మారి చిరు దగ్గరకు వచ్చారు. చిరు కూడా ఆనందంగా మాంచి ఇంటర్వూ ఇచ్చారు. ఇద్దరూ కలిసి అలనాడు తాము కలిసి నటించేటప్పటి అనుభవాలను వారు కలబోసుకున్నారు.

ఈ సందర్భంగా రోజా చిరంజీవిని ఓ క్వశ్చన్ అడిగారు. అప్పట్లో తాను, చిరు, ఆయన భార్య సురేఖ కలిసి దొంగచాటుగా, ముసుగులు వేసుకుని వెళ్లి, ప్యారడైజ్ బిరియానీ తిన్న విషయం గుర్తు వుందా అని ఆమె అడిగారు. దానికి చిరు ముసి ముసి నవ్వులు చిందించారు.

ఇదిలా వుంటే రోజా ఇంటర్వూ సంగతి తెలిసి జనం భలే రాజకీయాలు అనుకుంటున్నారు. దర్శకుడు దాసరి నారాయణరావు అటు రామ్ చరణ్ ను, ఇటు చిరును విమర్శించిన వ్యక్తి. ఆయనేమో ఖైదీ నెంబర్ 150కి ముఖ్య అతిథి అయ్యారు. ఇప్పుడు రోజా ఏమో ఇంటర్వూ చేసారు. ఖైదీ నెంబర్ 150 విజయం కోసం మెగాస్టార్ ఇంకా ఎన్ని సిత్రాలకు చాన్స్ ఇస్తారో మరి?