మరోసారి అదే కాంబినేషన్

సుకుమార్ కథతో హీరో రాజ్ తరుణ్ చేసిన సినిమా కుమారి 21 ఎఫ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ సుకుమార్ ఇటీవల రాజ్ తరుణ్ కు ఓ మంచి స్క్రిప్ట్…

సుకుమార్ కథతో హీరో రాజ్ తరుణ్ చేసిన సినిమా కుమారి 21 ఎఫ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ సుకుమార్ ఇటీవల రాజ్ తరుణ్ కు ఓ మంచి స్క్రిప్ట్ వినిపించాడు. అది ఓకె అయిపోయింది. దీన్ని ముందు సకుమార్ బ్యానర్ లోనే చేద్దాం అనుకున్నారు. కానీ మళ్లీ ఇప్పటికే దర్శకత్వం, నిర్మాణం, ఇలా చాలా పనుల్లో బిజీగా వుండడంతో సుకుమార్ ఆ ప్రాజెక్టును 14 రీల్స్ చేతిలో పెట్టేసారు. 

సో, సుకుమార్ కథతో, రాజ్ తరుణ్ మరో సినిమా 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతుందన్నమాట. ఇదే బ్యానర్ తో సంబంధం వున్న ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రాజ్ తరుణ్ మూడు సినిమాలు చేస్తున్నాడు.దొంగాట వంశీ డైరక్షన్ ఒకటి, మారుతి కథ సంజన రెడ్డి డైరక్షన్ లో ఇంకోటి,వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో మరోటి. ఇప్పుడు ఇది అదనం.. అంటే దాదాపు ఒకే కాంపౌండ్ లో నాలుగు సినిమాలు అన్నమాట.