త్రివిక్రమ్ తో ..ఆ ఇద్దరి సమస్య

త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి నితిన్ తో పిక్సయ్యాడు అన్న వార్తలు వినిపించాయి. దీంతో ఓ అప్ కమింగ్ డైరక్టర్ ఒడ్డున పడ్డాడు. నాగచైతన్య తో చందు మొండేటి సినిమా యథావిధిగా సెప్పెంబర్ నుంచి సెట్స్…

త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి నితిన్ తో పిక్సయ్యాడు అన్న వార్తలు వినిపించాయి. దీంతో ఓ అప్ కమింగ్ డైరక్టర్ ఒడ్డున పడ్డాడు. నాగచైతన్య తో చందు మొండేటి సినిమా యథావిధిగా సెప్పెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. కానీ ఇంకా ఇద్దరు అప్ కమింగ్ డైరక్టర్ల పరిస్థితి అయోమయంగానే వుంది. 

నితిన్ తొ రెండు ప్రాజెక్టులు ఫైనల్ అయ్యాయి. ఒకటి మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వేణుతొ, రెండు రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్. ఈ ఇద్దరు రెండు స్క్రిప్ట్ లు ఓకె చేయించుకుని వున్నారు నితిన్ తో. 

మరి త్రివిక్రమ్ రైలు వస్తుందా రాదా తెలిస్తే తప్ప, ఈ రెండింటిలో ఒకటి ప్లాట్ ఫారమ్ మీదకురాదు. అది వస్తే ఈరెండు పక్కన వుండడమే. రాకుంటే అప్పుడు వీటికి మోక్షం. ఎంత సీనియర్ అయినా త్రివిక్రమ్ ఇలా జూనియర్ల జీవితాలతో ఆడుకుంటే ఏలా?ఏదో ఒకటి తేల్చేయాలి కానీ?