ఇద్దరు హీరోయిన్ల పెళ్ళి బాజాలు!

బాలీవుడ్‌లో ఇద్దరు హీరోయిన్ల పెళ్ళి బాజాలు అతి త్వరలో మోగనున్నాయట. వాళ్ళిద్దరూ టాప్‌ హీరోయిన్స్‌ కావడం గమనార్హం. ఒకరేమో మన టాలీవుడ్‌ ‘మల్లీశ్వరి’ కత్రినాకైఫ్‌ కాగా, ఇంకో హీరోయిన్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో లవ్‌…

బాలీవుడ్‌లో ఇద్దరు హీరోయిన్ల పెళ్ళి బాజాలు అతి త్వరలో మోగనున్నాయట. వాళ్ళిద్దరూ టాప్‌ హీరోయిన్స్‌ కావడం గమనార్హం. ఒకరేమో మన టాలీవుడ్‌ ‘మల్లీశ్వరి’ కత్రినాకైఫ్‌ కాగా, ఇంకో హీరోయిన్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో లవ్‌ ఎఫైర్‌ నడుపుతున్న అనుష్క శర్మ.. అని బాలీవుడ్‌లో గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి.

కత్రినా, రణ్‌బీర్‌ కపూర్‌.. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ కథనాలు చాలాకాలంగా విన్పిస్తున్న విషయం విదితమే. వీరిద్దరూ ఇటీవలే ఓ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసి, అక్కడే ‘సంసారం’ కొనసాగిస్తున్నారనేది ఆ గాసిప్స్‌ సారాంశం. ఇక, అనుష్క శర్మ విరాట్‌ కోహ్లీల మధ్య ఎఫైర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇటు కత్రినా, అటు అనుష్క.. పెళ్ళి గురించి ప్రశ్నిస్తే ‘ఏమో.. వచ్చే ఏడాదిలో వుండొచ్చేమో..’ అని ఇప్పటికే హింట్‌ ఇచ్చేశారు. మే తర్వాత కత్రినా, రణ్‌బీర్‌ వైవాహిక బంధంతో ఒక్కటవుతారట. అనుష్క, విరాట్‌కోహ్లీ పెళ్ళి వ్యవహారంపైనే క్లారిటీ రావడంలేదుగానీ, కోహ్లీ కెప్టెన్‌ అయ్యాడు గనుక, లైఫ్‌లోనూ సెటిలైపోవాలనుకుంటున్నాడనేది ఓ ఊహాగానం.

అయితే అనుష్క శర్మ, కత్రినాకైఫ్‌.. ఇద్దరూ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా వున్నారు. ఆ ఆఫర్లే వీళ్ళ పెళ్ళికి అడ్డంకి కావొచ్చంటున్నారు బాలీవుడ్‌ సినీ జనం. ఏమో.. ఏమవుతుందోగానీ.. అనుష్క, కత్రినా తమ తమ లవర్స్‌తో పెళ్ళి పీటలెక్కితే.. ఈ వేడుకలే బాలీవుడ్‌లో హాటెస్ట్‌ హ్యాపెనింగ్స్‌ అవుతాయి 2015లో.