మళ్లీ మరో ‘మనం’

లెజెండ్ రామానాయుడు మరణించిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మెల్లగా దైనందిన కార్యక్రమాల్లో పడ్డారు. అవును 2 సినిమాను వచ్చేనెల 3న విడుదల చేస్తున్నారు. మరోపక్క రామానాయుడి చిరకాల కోరిక ఒకటి…

లెజెండ్ రామానాయుడు మరణించిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మెల్లగా దైనందిన కార్యక్రమాల్లో పడ్డారు. అవును 2 సినిమాను వచ్చేనెల 3న విడుదల చేస్తున్నారు. మరోపక్క రామానాయుడి చిరకాల కోరిక ఒకటి వుంది. అది పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి. 

తన కొడుకు వెంకటేష్, మనవళ్లు రానా, చైతన్య తో కలిసి ఓ సినిమా చేయాలని రామానాయుడు అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు మాంచి కథ దొరికితే ఈ ముగ్గురితో మల్టీ స్టారర్ గా సినిమా చేయాలని సురేష్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయన సూచన మేరకు కొందరు దర్శకులు కథ వండడంలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది.