యువ‌తి క‌త్తిపోట్ల‌పై ఏది నిజం?

వ‌రుడు అద్దెప‌ల్లి రామునాయుడిపై కాబోయే భార్య పుష్ప క‌త్తిపోట్ల ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. యువ‌తి న‌మ్మించి తీసుకెళ్లి అంత‌మొందించాలని ప్ర‌య‌త్నించింద‌నే వార్త క‌ల‌క‌లం రేపింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో యువ‌తి పుష్ప త‌ల్లి…

వ‌రుడు అద్దెప‌ల్లి రామునాయుడిపై కాబోయే భార్య పుష్ప క‌త్తిపోట్ల ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. యువ‌తి న‌మ్మించి తీసుకెళ్లి అంత‌మొందించాలని ప్ర‌య‌త్నించింద‌నే వార్త క‌ల‌క‌లం రేపింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో యువ‌తి పుష్ప త‌ల్లి ద్రౌప‌ది వాద‌న పూర్తి భిన్నంగా ఉంది. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డి, ఆ నింద‌ను త‌న కూతురిపై వేస్తున్నాడ‌ని పుష్ప త‌ల్లి వాపోతోంది.

అన‌కాపల్లి జిల్లా వి.మాడుగుల మండ‌లం ఘాట్‌రోడ్డుకు చెందిన అద్దెప‌ల్లి రామునాయుడుకు, రావిక‌మ‌తాని నివాసి వియ్య‌పు పుష్ప‌కు మే 20న పెళ్లి జ‌ర‌గాల్సి వుంది. హైద‌రాబాద్‌లో పీహెచ్‌డీ చేస్తున్న రామునాయుడు మూడు రోజుల క్రితం స్వ‌గ్రామం వెళ్లాడు. పుష్ప ఫోన్ చేయ‌డంతో సోమ‌వారం వ‌ధువు ఊరికి వెళ్లాడు. 

ఇద్దరూ క‌లిసి వ‌డ్డాది, కోమ‌ళ్ల‌పూడి దగ్గ‌ర‌లోని జ్యోతిర్మ‌యి బాబాదివ్య క్షేత్రాన్ని సంద‌ర్శించారు. స‌రదాగా కాసేపు గ‌డిపిన త‌ర్వాత గిఫ్ట్ ఇస్తాన‌ని, క‌ళ్లు మూసుకో అంటూ చెప్పి చున్నీతో గంత‌లు క‌ట్టింది. అనంత‌రం చాకుతో అత‌ని మెడ కుడివైపు నుంచి కంఠం వ‌ర‌కు కోసింది. నీతో పెళ్లి ఇష్టం లేదంటూ ఏడ్చింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ అంద‌రికీ తెలిసింది.

అయితే పుష్ప త‌ల్లి ద్రౌప‌ది వాద‌న మ‌రోలా ఉంది. పుష్ప‌ను త‌న వెంట పంపాల‌ని బ‌తిమ‌లాడిన‌ట్టు త‌ల్లి పేర్కొన్నారు. రామునాయుడే క‌త్తితో గొంతు కోసుకున్నాడ‌ని ఆమె ఆరోపించారు. త‌న కూతురి జీవితాన్ని బ‌ద్నాం చేయ‌డానికే నింద‌ను పుష్ప‌పై వేస్తున్న‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చున్నీతో క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి, క‌త్తితో పొడుస్తుంటే రామునాయుడు ఏం చేస్తున్నాడ‌ని ఆమె ప్ర‌శ్నించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై మ‌రికొన్ని అనుమానాలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. రామునాయుడినే అంత‌మొందించాల‌నేది పుష్ప ఉద్దేశ‌మైతే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అత‌న్ని స్కూటీపై ట్రీట్‌మెంట్ కోసం ఆస్ప‌త్రికి ఎందుకు త‌ర‌లిస్తుంద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న. రామునాయుడు బ‌తికితే నిజాలు బ‌య‌టికొస్తాయ‌ని గ్ర‌హించ‌లేనంత అమాయ‌కురాలు కాదు క‌దా? ప్ర‌స్తుతం పుష్ప‌ను పోలీసులు విచారిస్తున్నారు. 

క‌త్తిని పుష్పే కొనుగోలు చేశార‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కేసులో మిస్ట‌రీ కాసేప‌ట్లో వీడే అవ‌కాశం ఉంది. అంత వ‌ర‌కూ పుష్ప‌, రామునాయుడు చెప్పే అంశాలే ప్ర‌ధానంగా మీడియాలో హైలెట్‌గా నిల‌వ‌నున్నాయి. థ్రిల్ల‌ర్ సినిమా త‌ల‌పించే ఈ ఘ‌ట‌న‌లో వాస్త‌వాలేంటో పోలీసులే తేల్చాల్సి వుంది.