Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ బ్యానర్ సినిమా.. ప్రచారం కోసం సెలబ్రిటీలు మళ్లీ రంగంలోకి!

ఆ బ్యానర్ సినిమా.. ప్రచారం కోసం సెలబ్రిటీలు మళ్లీ రంగంలోకి!

తెలుగు, తమిళ భాషల చిత్ర పరిశ్రమల్లో ప్రస్తుతానికి సెలబ్రిటీలపై మంచి గ్రిప్ ఉన్న సంస్థ పీవీపీ. ఇప్పటికే ఈ రెండు చిత్ర పరిశ్రమల్లోనూ కొన్ని సినిమాలను రూపొందించిన ఈ పరిశ్రమ కు సినిమా వాళ్లే ఫ్యాన్స్. ఈ బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తోందంటే దాని కోసం ఎంతో కష్టపడి ప్రచారం చేసి పెడతారు. అదెలా ఉన్నా.. సూపర్ అని చెబుతారు. 

ఇది వరకూ సైజ్ జీరో, క్షణం సినిమాల విషయంలో ఇదే జరిగింది. సైజ్ జీరో సినిమా జనాలకు వెగటు పుట్టించినా సెలబ్రిటీలు మాత్రం దాన్ని ఒక రేంజ్ లో పొగిడేశారు. క్షణం సినిమా విషయంలోనూ సెలబ్రిటీలు సైజ్ జీరోకు ఉపయోగించిన పడికట్టు పదాలనే వాడినా... ఇది ప్రేక్షకులను కొంత వరకూ ఆకట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పీవీపీ బ్యానర్ లో రూపొంది వచ్చే వారంలో విడుదల కానున్న "ఊపిరి'' కమ్ 'తోలా''సినిమా ప్రచారం కోసం నడుములు  బిగిస్తున్నారు తెలుగు, తమిళ సినీ సెలబ్రిటీలు. 

ఇప్పటిక అటు నాగార్జునకు ఇటు పీవీపీకి సన్నిహితురాలు అయిన అనుష్క రంగంలోకి దిగింది. ఈ సినిమా విడుదలకు వారం ఉందనంగానే ప్రమోషన్ ను ఇలాంటి వాళ్లంతా మొదలుపెట్టేశారు.అత్యంత సన్నిహితురాలు అయిన అనుష్క రంగంలోకి దిగేసింది... ఇక ఒక్కొక్కరుగా చిత్ర పరిశ్రమలోని ముఖ్యులంతా ఈ సినిమాను ప్రశంసల్లోముంచెత్తే పనిని మొదలుపెట్టే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా ఏర్పాటు  చేయనున్న ప్రివ్యూ తర్వాత సెలబ్రిటీలు అంతా ఈ సినిమాను పొగడటానికి పదాలను కూడా దాదాపుగా ఇప్పటికే రెడీ చేసుకున్నట్టే. మరి పీవీపీ సినిమా అంటే.. అదెలా ఉన్న సెలబ్రిటీలు పొగిడేస్తారంతే.ప్రత్యేకించి సోషల్ నెట్ వర్కంగ్ సైట్లలో ఆ హోరును తట్టుకోవడం నెటిజన్లకు కష్టమైన పనే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?