ఆదిపినిశెట్టి-తాప్సీ-నువ్వెవరు

చాలా సైలెంట్ గా తీసేసారు సినిమాను కోన వెంకట్ తో కలిసి నిర్మాత ఎంవివి సత్యనారాయణ. సినిమాను చాలా శాతం వైజాగ్ లోనే ఫినిష్ చేసారు. ఆది పినిశెట్టి-తాప్సీ కీలక పాత్రల్లో నటించిన ఈ…

చాలా సైలెంట్ గా తీసేసారు సినిమాను కోన వెంకట్ తో కలిసి నిర్మాత ఎంవివి సత్యనారాయణ. సినిమాను చాలా శాతం వైజాగ్ లోనే ఫినిష్ చేసారు. ఆది పినిశెట్టి-తాప్సీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. కాస్త థ్రిల్లర్ టచ్ వున్న ఈ సినిమాకు 'నువ్వెవరు' అనే టైటిల్ పెట్టినట్లు బోగట్టా.

గతంలో గీతాంజలి వంటి హిట్ సినిమా తీసిన ఎంవివి బ్యానర్ తో కోన కార్పొరేషన్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఆది పినిశెట్టి, తాప్సీలకు తోడుగా గురు సినిమాలో హీరోయిన్ గా నటించిన రితిక సింగ్ కూడా మరో కీలకపాత్రలో నటించింది. నిన్ను కోరి వంటి హిట్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వున్న కోన వెంకట్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను ఆ సినిమా హీరో నాని ద్వారా ప్రకటించబోతున్నారు.

అలా ప్రకటించబోయే టైటిల్ నే..'నువ్వెవరు' అని తెలుస్తోంది. టైటిల్ ఆసక్తికరంగానే వుంది. కాంబినేషన్ కూడా బాగానే వుంది. ఈ మద్య ఆది పినిశెట్టి కూడా ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. రంగస్థలం తరువాత వస్తున్న సినిమా కాబట్టి, ఆ ఇమేజ్ కూడా తోడవుతుంది.