Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

ఎఎమ్ రత్నం అడ్వాన్స్ మాటేమిటి?

ఎఎమ్ రత్నం అడ్వాన్స్ మాటేమిటి?

ఎ ఎమ్ రత్నం అంటే ఒకప్పటి బడా నిర్మాత. ఒకటి రెండేళ్ల క్రితం కూడా తమిళంలో పెద్ద హిట్ లు కొట్టారు. కానీ తెలుగునాట సరైన ప్రాజెక్టు తెరకు ఎక్కించలేకపోతున్నారు. కొడుకు కోసం తీసిన ఆక్సిజన్ నిలబడలేదు. ఆ సంగతి అలా వున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్న సినిమా మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు.

ఎఎమ్ రత్నం ఏకంగా అయిదు కోట్ల అడ్వాన్స్ పవన్ కు ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. మరి ఎంత వరకు నిజం అన్నది వాళ్లిద్దరికే తెలియాలి. అయితే ఆ సినిమా ఊసు ఇటీవల వినిపించకుండా పోయింది. మధ్యలో మైత్రీమూవీస్ తెరపైకి వచ్చింది. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో స్క్రిప్ట్ రెడీ చేసారు.

ఫైనాన్షియల్ గా చూసుకుంటే మైత్రీకి వున్న జోరు ఎఎమ్ రత్నంకు వుండకపోవచ్చు. బహుశా అందువల్లే పవన్ ముందుగా మైత్రీ సినిమా ఎంచుకున్నారేమో? కానీ అజ్ఞాతవాసి తరువాత ఈక్వేషన్లు మారుతున్నాయని వినికిడి.

మైత్రీ మూవీస్ సంస్ధ పవన్ తో డైరక్టర్ త్రివిక్రమ్ ద్వారా డీల్ చేస్తోందని వినికిడి. తాము చేయడానికి రెడీనే కానీ, 50-60 కాల్ షీట్ లు వరుసగా ఇస్తే తప్ప తీయలేమనే సంకేతాన్ని త్రివిక్రమ్ ద్వారా చేరవేసినట్లు తెలుస్తోంది.

ఇంకో పక్క ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ ఓ సినిమాను పవన్ తో హారిక హాసిని బ్యానర్ పైనే చేసే అవకాశం వుందనీ వార్తలు వినవస్తున్నాయి. ఈలోగా ఎఎమ్ రత్నం మళ్లీ తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇప్పడు కనుక పవన్ ఎఎమ్ రత్నంకు సినిమా చేయకపోతే, మళ్లీ మరో ఏడాది, రెండేళ్ల దాకా చేయడం కష్టమే అవుతుంది. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?