Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య క్యాంప్ లో దబిడి.. దిబిడి..?

బాలయ్య క్యాంప్ లో దబిడి.. దిబిడి..?

బయోపిక్ వ్యవహారం బాలయ్య క్యాంప్ లో కాస్త సీరియస్ గానే కిందామీదా అవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఇధ్దరిని తప్పించి కేవలం బాలయ్యను మాత్రమే నిర్మాతగా వుంచుతున్నారని, సాయి కొర్రపాటి, ఇందూరి విష్ణులు కేవలం సమర్పకులుగానే వుంటారని గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. అదే సమయంలో బాలయ్య దగ్గర ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్న తోడల్లుడు ప్రసాద్ ను కూడా ఈ విషయమై అభిప్రాయం కోరడం, దానికి అయన వివరంగా చెప్పడం కూడా జరిగింది.

గ్రేట్ ఆంధ్రలో వచ్చిన ఈ స్టోరీలను తీసుకుని ఓ ఛానెల్ అర్జెంట్ గా ఓ స్టోరీ ప్రసారం చేసేసింది. దాంతో బాలయ్య క్యాంప్ లో హడావుడి హల్ చల్ మొదలయింది. ఆ స్టోరీ ఏమిటి అని చానెల్ తాలూకా జనాలను అడిగితే, గ్రేట్ ఆంధ్రలో వచ్చిన వార్తల ఆధారంగానే చేసినట్లు లోపాయికారీగా చెప్పుకు వచ్చినట్లు తెలుస్తోంది.

అక్కడి నుంచి ఇక బాలయ్య క్యాంప్ లో మరిన్ని విచారణలు జరుగుతున్నాయి? ఎవరు లీక్ చేసారు? ఎలా లీక్ చేసారు? అసలు ఎవరు చెప్పి వుంటారు? దీనివెనుక ఎవరున్నారు? వంటి వాటిపై ఒకటికి నాలుగు పంచాయతీలు జరుగుతున్నాయి. ఆఖరికి ఎవరో ఒకర్ని ఈ వార్తలకు బలి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి అంతాచూస్తే వడ్లగింజలో బియ్యం గింజ అంత. సినిమా నిర్మాణం బాలయ్య సోలోగా చేసుకోవాలనుకుంటున్నారు, చేసుకుంటున్నారు. అదే వార్తల్లో వచ్చింది. దానికి ఇంత పంచాయతీలు, ముద్దాయిలు ఎవరో తేల్చడం అన్నది ఎందుకో తెలియదు. 

చూస్తుంటే ఈ వార్తలు, ఈ సంఘటన ఆధారంగా చేసుకుని, ఇదే అదను అని బాలయ్య కోటరీలోని కొందరిని బయటకు సాగనంపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో సాయి కొర్రపాటి, విష్ణు, బాలయ్య వ్యవహారాలు అన్నీచూసే డాక్టరు సురేంద్ర అంతా మౌనం వహించినట్లు తెలుస్తోంది. మొత్తంమీద బయోపిక్ ఆఫ్ ది స్క్రీన్ హడావుడి కూడా బాగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?