బాలయ్యపై రామోజీ సినిమా?

తమిళ సినిమా శైవం ను తెలుగులో రూపొందించారు..దర్శకుడు క్రిష్, రామోజీ రావు (ఉషాకిరణ్ మూవీస్ సంస్థ) కలిసి. చక్కటి కుటుంబ కథా చిత్రం. అన్నీ సమపాళ్లలో రంగరించిన ఈ సినిమా మాతృక తమిళంలో పెద్ద…

తమిళ సినిమా శైవం ను తెలుగులో రూపొందించారు..దర్శకుడు క్రిష్, రామోజీ రావు (ఉషాకిరణ్ మూవీస్ సంస్థ) కలిసి. చక్కటి కుటుంబ కథా చిత్రం. అన్నీ సమపాళ్లలో రంగరించిన ఈ సినిమా మాతృక తమిళంలో పెద్ద హిట్ . తెలుగులో కూడా చాలా చక్కగా వచ్చిందని టాక్. సినిమాను చూసిన దిల్ రాజు..ఫిదా అయిపోయి, రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు తానే తీసేసుకున్నారు. 

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. సరైన స్లాట్ దొరక్క వెనకా ముందు అవుతోంది. ఇప్పుడు వేసవి సెలవులను వినియోగించుకోవడం ఇలాంటి సినిమాకు చాలా అవసరం. అందుకే మే 1న విడుదల చేద్దామని అంటున్నారట దిల్ రాజు. ఎందుకంటే సత్యమూర్తి సినిమా నైజాం హక్కులు ఆయనవే. ఈ వారం దాటితే దాని హడావుడి సద్దుమణుగుతుంది. 

ఆ తరువాత ఓకె బంగారం విడుదల వుంది. దానికి ఒకటి రెండు వారాలు గ్యాప్ ఇచ్చి ఈ సినిమా విడుదల చేద్దామన్నది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తోంది. అంటే సమ్మర్ హాలీడేస్ ను దిల్ రాజు మూడు సినిమాలకు వాడుకున్నట్లు అవుతుంది. అన్నీ బాగానే వున్నాయి. కానీ బాలయ్య సినిమా లయన్ ఈ నెలాఖరులో వుంది. అది పక్కా మాస్ సినిమా. ఇది పక్కా ఫ్యామిలీ సినిమా. పోటీ అనుకోవడమే కరెక్ట్ కాదనుకోండి. అయినా బాలయ్య సినిమా మీద రామోజీ సినిమా విడుదల వుంటుందా అన్నదే టాలీవుడ్ వర్గాల అనుమానం.