భయపెట్టి ఆకట్టుకోవాలనుకుంటుందట

గతంలో హర్రర్‌ చిత్రాలు భయపెట్టడానికే నిర్మించేవారు. హర్రర్‌ చిత్రాల ట్రెండ్‌ ఇంగ్లీషు వాళ్లు ఎప్పుడో మొదలు పెట్టారు. వాళ్ళు చూపించినంత టెక్నిక్‌తో మనవాళ్ళు కూడా భయపెట్టే చిత్రాలు తీశారు. ఇప్పుడు కాస్త వెరైటీగా దెయ్యాలతో…

గతంలో హర్రర్‌ చిత్రాలు భయపెట్టడానికే నిర్మించేవారు. హర్రర్‌ చిత్రాల ట్రెండ్‌ ఇంగ్లీషు వాళ్లు ఎప్పుడో మొదలు పెట్టారు. వాళ్ళు చూపించినంత టెక్నిక్‌తో మనవాళ్ళు కూడా భయపెట్టే చిత్రాలు తీశారు. ఇప్పుడు కాస్త వెరైటీగా దెయ్యాలతో కామెడీ చేయిస్తున్నారు. అందమైన హీరోయిన్స్‌ కూడా దెయ్యాలుగా నటించడానికి ఆసక్తి చూపించడం విశేషం.

ప్రేమకథా చిత్రంతో నందిత అందమైన దెయ్యంగా కామెడీ పండించింది. 'గీతాంజలి' చిత్రంలో అంజలి గ్లామరస్‌ దెయ్యంగా హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు అదే కోవలోకి కలర్స్‌ స్వాతి వచ్చి చేరింది. ఈమె నటించే హర్రర్‌ కామెడీ చిత్రం పేరు 'త్రిపుర'. ఈ చిత్రానికి కూడా కోన వెంకట్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడట. దెయ్యంగా నటించడానికి తనకున్న కళ్ళు ఎంతో హెల్ప్‌ అవుతాయని కలర్స్‌ స్వాతి విశ్వాసంతో వుందట.

హీరోయిన్‌గా 'అష్టాచెమ్మా', 'గోల్కొండ హైస్కూల్‌', 'స్వామిరారా', 'కార్తికేయ' లాంటి చిత్రాలు చేసినా ఆమె ఆశించిన స్థాయిలో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. తమిళ, మలయాళం సినిమాల్లోకూడా ఇక్కడి స్థానాన్ని పొందింది తప్ప గొప్పగా పేరు తెచ్చుకున్న దాఖలాల్లేవు. ఇప్పుడు 'త్రిపుర'గా తన కళ్ళతో భయపెడుతూనే నవ్విస్తానంటుంది స్వాతి. ఈ సినిమాతోనైనా ఆవిడ ఆశించే స్థాయి వస్తుందేమో చూడాలి మరి.