బెల్లంకొండ అప్పులు సగం తీరాయి

ప్రెస్జీజీ పద్మనాభం లా భారీ సినిమాలకు అంకతమైపోయి, ఖజానా గుల్ల చేసుకున్నాడు బెల్లంకొండ సురేష్. అప్పులు చుట్టుముట్టేసరికి కిందామీదా అయ్యాడు. అయితే బెల్లంకౌండ ఆస్తిపాస్తులు తెలిసినవారు ఆయనకేం కాదు అని అంటూ వచ్చారు. కానీ…

ప్రెస్జీజీ పద్మనాభం లా భారీ సినిమాలకు అంకతమైపోయి, ఖజానా గుల్ల చేసుకున్నాడు బెల్లంకొండ సురేష్. అప్పులు చుట్టుముట్టేసరికి కిందామీదా అయ్యాడు. అయితే బెల్లంకౌండ ఆస్తిపాస్తులు తెలిసినవారు ఆయనకేం కాదు అని అంటూ వచ్చారు. కానీ ఎందుకయినా మంచిదని బెల్లంకొండ తన కొడుకు రెండో సినిమాను వేరే బ్యానర్ కు బదిలీ కూడా చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. మరొ పక్క తన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే పని ప్రారంభించాడు. ఈ దశలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు వార్తలు వినవచ్చాయి. ముంబాయి జనాల గూండాగిరీ జనాల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని వినికిడి.

ఆ దశలో కొంతకాలం అజ్ఞాత వాసంలో కూడా వున్నారని టాలీవుడ్ కో గుసగుసలు వినిపించాయి.

మొత్తానికి బయటి బాకీలు అన్నీ ఎలాగోలా సెటిల్ చేసేసారని తెలుస్తోంది. బాగా దగ్గరవాళ్ల బాకీలు మాత్రం వున్నాయట. దీంతో కొడుకు రెండో సినిమాను మళ్లీ తన చేతుల్లోనే వుంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పట్లో బయటి సినమాలు చేయడం అంటే చాలా యత్నాలు చేయాలి. అందుకే కొడుకు సినిమా తానే చేయాలని అనుకుంటున్నాడట. నవంబర్ తొలివారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి దర్శకుడు. శృతి హాసన్ కథానాయిక కావచ్చు.