నేను లోకల్ దర్శకుడితో రామ్ చరణ్?

నాని నటించిన నేను లోకల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ తన కొత్త సినిమా ఏంటనే విషయాన్ని ప్రకటించలేదు. Advertisement మరోవైపు ఆ…

నాని నటించిన నేను లోకల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ తన కొత్త సినిమా ఏంటనే విషయాన్ని ప్రకటించలేదు.

మరోవైపు ఆ సినిమాకు కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించిన బెజవాడ ప్రసన్నకుమార్ మాత్రం మరో కొత్త కథపై చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాడు. ఇప్పుడా కథతోనే రామ్ చరణ్ సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే.

ప్రస్తుతం త్రినాధరావు నక్కిన, బెజవాడ ప్రసన్నకుమార్ ఆ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తో ఒక సెషన్ స్టోరీ డిస్కషన్లు కూడా పూర్తయ్యాయి. స్క్రీన్ ప్లే తో పాటు సినిమా పూర్తయిన తర్వాత మరోసారి చరణ్ కు వినిపించబోతున్నారు.

ఈ సినిమాపై స్పందించడానికి త్రినాధరావు, ప్రసన్నకుమార్ అందుబాటులోకి రాలేదు. మరోవైపు దిల్ రాజు మాత్రం అప్పుడే ఈ ప్రాజెక్టుపై స్పందించడం సరికాదంటున్నాడు. చర్చలు మాత్రం జరుగుతున్నాయనే విషయాన్ని ఒప్పుకున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తర్వాత త్రినాధరావు నక్కిన సినిమా ఉంటుందా ఉండదా అనే అంశంపై ఓ స్పష్టత వస్తుంది.