దాసరి నారాయణరావు నిర్మాతగా, పవన్కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి వున్న విషయం విదితమే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కాస్తా పవన్కళ్యాణ్ నుంచి చిరంజీవి వైపు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. అన్నయ్య కోరిక మేరకు తమ్ముడు త్యాగం చేశాడట.
అయితే, ఇప్పటికే పవన్కళ్యాణ్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాకి సంబంధించి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందనీ, ఈ దశలో పవన్ డ్రాప్ అయ్యేందుకు అవకాశాలు తక్కువనీ మరో వాదన బలంగా విన్పిస్తోంది. అయినప్పటికీ, దాసరి నారాయణరావు నిర్మాతగా, చిరంజీవి హీరోగా సినిమా ఖాయమైపోయిందన్నది ఇంకో వాదన. ఇటీవలే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందట.
వాస్తవానికి చాన్నాళ్ళ క్రితమే చిరంజీవితో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి వుంది. విజయ్భాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన 'జై చిరంజీవ' చిత్రానికి రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమా సమయంలోనే చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయాలనుకున్నారు. కొన్ని కారణాలతో అప్పట్లో ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో త్రివిక్రమ్ - చిరంజీవి కాంబినేషన్లో సినిమా సెట్స్పైకి వచ్చేందుకు అవకాశమేర్పడింది.
అన్నట్టు, దాసరి నారాయణరావుకీ చిరంజీవికీ మధ్య సఖ్యత 'ఆంధ్రప్రదేశ్లోని కాపు ఉద్యమం' కారణంగా పెరగడం, అదే ఇప్పుడు దాసరి నిర్మాణంలో చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కేందుకు మార్గం సుగమం చేయడం మరో విశేషం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు