పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను ఓ సినిమా చేస్తా అంటూ దర్శకుడు దాసరికి మాటో, ఆపర్ నో ఇచ్చాడు మొత్తానికి. కానీ దాసరి ఆ ఆఫర్ ను, ఇప్పట్లో వాడుకునే పరిస్థితి వున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం పవన్ తన మిత్రుడు శరద్ మురార్ సినిమా చేస్తున్నారు. తరువాతి సినిమాగా ఏఎమ్ రత్నం సినిమా చేయబోతున్నారు. ఆ తరువాత లేదా ముందో హారిక హాసిని సినిమా వుంటుంది. మరి దాసరి సినిమా ఎప్పుడు?
ఇక్కడ పవన్ తో సమస్య కాదు..దాసరితోనే అని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు దాసరి తనకున్న కొన్ని సమస్యల కారణంగా ఇప్పట్లో చిత్ర నిర్మాణం చేపట్టకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బొగ్గు కుంభకోణం కేసులను దాసరి ఎదుర్కోంటున్నారు. ఆయన కు చెందిన కొన్ని సంస్థలపై సిబిఐ విచారణ వుంది.
కోర్టులో కేసు వుంది. ఇప్పుడు ఆయన నిధులు సమీకరించి, సినిమా చేయడం అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాసరి ఎప్పుడు చేస్తానంటే అప్పుడు పవన్ రెండీ. అది వాస్తవం. కానీ దాసరి రెడీ కావడానికి టైమ్ పట్టేటట్లుంది. అందుకే పవన్-త్రివిక్రమ్ సినిమాను హారిక హాసినికే చేయాలని డిసైడ్ అయినట్లు వినికిడి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు