Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డిఫరెంట్ గా చేస్తాడట

డిఫరెంట్ గా చేస్తాడట

ప్లాన్డ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాకు శ్రీకారం చుట్టేసాడు. ప్రస్తుతం శ్రీవాస్ డైరక్షన్ లో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఇది ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. అందుకే మరో సినిమాకు శ్రీకారం చుట్టేసాడు.

వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని నిర్మించే ఈ సినిమాకు శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు పని చేస్తాడు. థమన్ సంగీతం అందిస్తాడు. ఇంతకీ ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే, అందరు హీరోలు ఏదో సమ్ థింగ్ కొత్తగా ట్రయ్ చేస్తున్నట్లే, ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఏదో చేయబోతున్నాడని తెలుస్తోంది. కమర్షియల్ వాల్యూస్ వుంటూనే, కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించే ఈ సినిమా వివరాలు మరిన్ని తెలియాల్సి వుంది. శ్రీనివాస్ ప్రస్తుతం చేస్తున్న సాక్ష్యం సినిమా మే 11న విడుదల కాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?