దిల్ రాజు ఇండియన్ ను వదల్లేదట

ఇండియన్ 2 సినిమా ప్రకటనతో ఒక్కసారి సౌత్ సినిమా దృష్టిని ఆకర్షించేసాడు నిర్మాత దిల్ రాజు. అయితే మళ్లీ ఒక్కసారిగా ఆ ప్రాజెక్టు ఆగిదంటూ వదంతుల గుప్పు మన్నాయి. కానీ వీటిని జస్ట్ వదంతులగా…

ఇండియన్ 2 సినిమా ప్రకటనతో ఒక్కసారి సౌత్ సినిమా దృష్టిని ఆకర్షించేసాడు నిర్మాత దిల్ రాజు. అయితే మళ్లీ ఒక్కసారిగా ఆ ప్రాజెక్టు ఆగిదంటూ వదంతుల గుప్పు మన్నాయి. కానీ వీటిని జస్ట్ వదంతులగా తోసి పుచ్చేస్తున్నాడు దిల్ రాజు. సినిమా క్యాన్సిల్ అయితే తనకేం మొహమాటం లేదని, తానే చెప్పేస్తానని, ఇండియన్ 2 పక్కాగా వుందని సన్నిహితులతో చెబుతున్నాడట.

అయితే ఇదిలా వుంటే, అసలే ఆర్థిక సమస్యల్లో వున్న నిర్మాత ఎ.ఎమ్ రత్నం మాత్రం ఈ ప్రాజెక్టులో తనను కూడా పార్టనర్ ను చేయమని దిల్ రాజు ను మొహమాట పెడుతున్నట్లు వినికిడి. పార్ట్ వన్ నిర్మాతగా తనకు వున్న క్రెడిట్, పార్ట్ 2 లో కూడా భాగస్వామిగా వుంటే మరింత పెరుగుతుందని రత్నం ఆలోచన. అయితే దీనికి దిల్ రాజు నో అని కానీ, ఎస్ అని కానీ చెప్పడం లేదని వినికిడి.

శంకర్ ఈ ప్రాజెక్టును తనకు అప్పగించారని, ఆయన ఎలా అంటే అలా తప్ప, తనదేమీ లేదని దిల్ రాజు తప్పకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎ.ఎమ్ రత్నం ఇండియన్ 2 కి అడ్డం పడడానికి రీజన్ ఏమీ లేదు. ఆ ప్రాజెక్టు వేరు. ఈ ప్రాజెక్టు వేరు.

టైటిల్ లో ఎక్స్ టెన్షన్ వున్నంత మాత్రాన ఆయన చేసేదేమీ  లేదు. అలా అయితే రాజుగారి గది పార్ట్ వన్ ను సాయి కొర్రపాటి నిర్మిస్తే, పార్ట్ 2 ను పివిపి నిర్మించారు. అందవల్ల దిల్ రాజు సన్నిహిత వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఇండియన్ 2 యధావిధిగా వున్నట్లే.