Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భారీ ప్రాజెక్టు.. మళ్లీ ఆగిపోయింది

భారీ ప్రాజెక్టు.. మళ్లీ ఆగిపోయింది

సౌత్ నుంచి వస్తున్న అతిభారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది సంఘమిత్ర. తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై సి.సుందర్ దర్శకత్వంలో సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ముందే అష్టకష్టాలు పడుతోంది. తాజాగా ఈ మూవీపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. 

ఈ నెలలో సెట్స్ పైకి వస్తుందనుకున్న సంఘమిత్ర సినిమా ఇప్పట్లో రాదని తేలిపోయింది. షూటింగ్ మాట దేవుడెరుగు, టోటల్ సినిమానే ఆగిపోయినట్టు టాక్. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వలేదని యూనిట్ చెబుతున్నప్పటికీ.. సినిమా ఆగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి హీరోయిన్ దిశాపఠానీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సౌత్ లో ఓ పెద్ద సినిమాకు ఓకే చెప్పాను కానీ ఆ ప్రాజెక్టు వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని స్వయంగా దిశాపఠానీ ఓ కార్యక్రమంలో బయటపెట్టింది. నేరుగా సంఘమిత్ర పేరును ఆమె ప్రస్తావించలేదు కానీ దిశాకు సంబంధించి పెద్ద సౌత్ ప్రాజెక్టు అంటే అది సంఘమిత్ర మాత్రమే. ఆమె ప్రకటనతో ఈ సినిమాపై ఇప్పుడు మరిన్ని డౌట్స్ పెరిగాయి. 

కేన్స్ ఫిలింఫెస్టివల్ లో గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు సంఘమిత్ర ప్రాజెక్టును. దాదాపు 300కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు. శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ స్క్రిప్ట్ బాగాలేదంటూ ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో దిశాను తీసుకున్నారు. ఇప్పుడు ఈమె కూడా సినిమాపై అనుమానం కలిగేలా వ్యాఖ్యలు చేసింది. 

మరోవైపు ఇందులో నటించబోయే హీరోలు ఆర్య, జయం రవి కూడా వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇవన్నీ చూస్తుంటే సంఘమిత్ర ప్రాజెక్టు అగిపోయినట్టే కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?