పిబ్రవరి 9న ఏ తేజ వస్తాడు?

ఫిబ్రవరి 9న విడుదల అంటూ వరుణ్ తేజ లేటెస్ట్ మూవీ తొలిప్రేమకు డేట్ ప్రకటించారు. కానీ అంతకు ముందు ఎప్పుడో డేట్ ఇచ్చాం, మేమే వస్తాం అంటున్నారు సాయి ధరమ్ తేజ నటిస్తున్న ఇంటిలిజెంట్/ధర్మాభాయ్…

ఫిబ్రవరి 9న విడుదల అంటూ వరుణ్ తేజ లేటెస్ట్ మూవీ తొలిప్రేమకు డేట్ ప్రకటించారు. కానీ అంతకు ముందు ఎప్పుడో డేట్ ఇచ్చాం, మేమే వస్తాం అంటున్నారు సాయి ధరమ్ తేజ నటిస్తున్న ఇంటిలిజెంట్/ధర్మాభాయ్ యూనిట్ జనాలు. ఇద్దరు మెగా హీరోలు అయితే ఒకటే డేటున రారు. అది పక్కా. ఎవరో ఒకరు ముందుకో, వెనక్కో జరగాలి? ఎవరు జరుగుతారు? అన్నది విషయం.

సాయి ధరమ్ తేజ సినిమాకు వివి వినాయక్ డైరక్టర్. సినిమా చకచకా లాగించేస్తున్నారని, దాదాపు పూర్తి కావచ్చిందని, అందువల్ల ఇంటిలిజెంట్ లేదా ధర్మాభాయ్ లో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అయితే ప్రచారం స్టార్ట్ చేస్తారని వినిపిస్తోంది. ఫిబ్రవరి 9న అదే పక్కా అని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పైగా తొలి ప్రేమ సినిమా వర్క్ ఇంకా చాలా వుందని టాక్. అదీ కాక, ఆ సినిమాను నిర్మాత దిల్ రాజు అవుట్ రేట్ గా వరల్డ్ రైట్స్ కొనేసారు. అందువల్ల ఆయన అన్నీ చూసుకుని, సేఫ్ బెట్ గా వుండేలా విడుదల చేస్తారని, సో, ఫిబ్రవరి 9న ఇంకా రెండు సినిమాలు వున్నందున, వదలకపోవచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికి అయితే నాగశౌర్య ఛలో, మోహన్ బాబు గాయత్రి రెండూ బలంగా ఫిక్స్ అయివున్నాయి. మరి ఇద్దరు తేజల్లో ఎవరు వస్తారో? బరిలోకి.