హైదరాబాద్ కు రేణు దేశాయ్

నటి రేణు దేశాయ్ తన మకాం మళ్లీ హైదరాబాద్ కు మార్చేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తో వైవాహిక జీవితం ముగిసిన తరువాత ఆమె తమ స్వస్థలం అయిన మహారాష్ట్రకు…

నటి రేణు దేశాయ్ తన మకాం మళ్లీ హైదరాబాద్ కు మార్చేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తో వైవాహిక జీవితం ముగిసిన తరువాత ఆమె తమ స్వస్థలం అయిన మహారాష్ట్రకు వెళ్లిపోయారు. ఆమె సన్నిహిత బంధువులు హైదరాబాద్ లో వున్నా, వచ్చి వెళ్లడమే కానీ, ఇక్కడ ఉండలేదు.

అయితే లేటెస్ట్ సమాచారం ఏమిటంటే, ఆమె మళ్లీ హైదరాబాద్ కు మకాం మార్చారన్నది. పిల్లలు పెద్దవాళ్లు అయినందున, తండ్రికి దగ్గరగా వుంటారని, అలాగే తను కూడా మళ్లీ ప్రొఫెషనల్ గా యాక్టివ్ కావాలని ఆమె అనుకుంటున్నట్లు బోగట్టా. లేటెస్ట్ గా ఢీ డ్యాన్స్ షోలో ఆమెను జడ్జిగా తీసుకున్నారు.

ఈ డ్యాన్స్ షో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మెగా ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ షోకు ఆమె జడ్జ్ గా రెగ్యులర్ గా హాజరవుతున్నారు. పవన్ కళ్యాణ్ వారసుడిగా కొడుకు అకీరా రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నది వాస్తవం. అయితే అందుకు చాలా సమయం వుంది. మొత్తంమీద అనేకానేక కారణాల రీత్యా రేణుదేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ షిప్ట్ అయినట్లు బోగట్టా.

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'