Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇప్పుడు కొరటాల టార్గెట్ అదేనట

ఇప్పుడు కొరటాల టార్గెట్ అదేనట

కొరటాల శివ తనకు తనే ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. అదే దిశగా తన స్క్రిప్ట్ ను తయారుచేస్తున్నారట. మిర్చి, శ్రీమంతుడు సినిమాల విషయంలో తొలి రోజు తొలి ఆట నుంచే నూటికి నూరు శాతం పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది. పైగా క్రిటిక్స్ కు ఈ సినిమా పూర్తి సంతృప్తినివ్వలేదు. సో, కొరటాల శివ ఇప్పుడు అదే విషయం చాలెంజింగ్ గా తీసుకున్నారట. 

ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ తో చేయబోయే సినిమాకు ఫస్ట్ డే, ఫస్ట్ షో పడిన దగ్గరి నుంచి నూరు శాతం పాజిటివ్ టాక్ వచ్చేంత గొప్పగా స్క్రిప్ట్ తయారుచేయాలని  పట్టుదల మీద వున్నాడట. అందుకే సీరియస్ గా అదే పనిమీద వున్నారట. 

ఇప్పటికే ఈ స్క్రీప్ట్ లోని రెండు మూడు సీన్లను సన్నిహితులతో షేర్ చేసుకున్నారట. ఆ సీన్లన్నీ అద్భుతంగా వచ్చాయని వినికిడి. ఈ పాజిటివ్ ఒపపీనియన్స్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి తీసుకున్న తరువాత మిగిలిన స్క్రిప్ట్ ను కూడా చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నాడట కొరటాల.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?