Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ 'బ్రదర్స్‌' పక్కా.?

జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ 'బ్రదర్స్‌' పక్కా.?

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, కళ్యాణ్‌రామ్‌ నిర్మించనున్న 'బ్రదర్స్‌' సినిమాకి సంబంధించి అక్టోబర్‌ 5న స్పష్టత రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తోపాటు కళ్యాణ్‌రామ్‌ నటిస్తాడనే ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఇటీవలే కళ్యాణ్‌రామ్‌, తన 'ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌' పతాకంపై 'బ్రదర్స్‌' టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించాడు. దాంతో, ఆ 'బ్రదర్స్‌' టైటిల్‌, ఎన్టీఆర్‌ కోసమేనన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. 

తాజాగా, అక్టోబర్‌ 5న తన 'ఇజం' సినిమా ఆడియో విడుదల వేడుక నుంచే, సోదరుడు ఎన్టీఆర్‌తో చేయబోయే 'బ్రదర్స్‌' సినిమాపై స్పష్టత ఇవ్వాలని కళ్యాణ్‌రామ్‌ అనుకుంటున్నాడనే గాసిప్‌ బయటకు వచ్చింది. ఇది గాసిప్‌ కాదు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.. అంటూ సినీ వర్గాల్లో ప్రచారం గట్టిగానే జరుగుతోంది. చాలాకాలంగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ ప్రయత్నం ఇప్పటిదాకా కొలిక్కి రాలేదు. 

ప్రస్తుతం అన్నీ కుదిరాయనీ, దర్శకుడు ఎవరన్నదానిపైనా క్లారిటీ వచ్చిందనీ తెలుస్తోంది. ప్రస్తుతానికైతే వక్కంతం వంశీ చెప్పిన కథ, ఎన్టీఆర్‌ దగ్గరే వుంది. ఈ కథతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అనుకుంటున్నాడు. అయితే, ఎన్టీఆర్‌ మాత్రం వంశీతో సినిమా విషయంలో ఇప్పటిదాకా అంత స్పష్టతతో లేడన్న ప్రచారం జరుగుతోంది. ఇంకోపక్క, అనిల్‌ రావిపూడితో సినిమా చేయాలనే ఆలోచనతో ఎన్టీఆర్‌ వున్నట్లుగా తెలుస్తోంది. 

మొత్తమ్మీద, అక్టోబర్‌ 5 అంటే ఎల్లుండే గనుక, ఈలోగా అన్ని కన్‌ఫ్యూజన్‌లూ తొలగిపోయి, 'బ్రదర్స్‌'పై క్లారిటీ వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం.. అక్టోబర్‌ 5న నందమూరి 'బ్రదర్స్‌' నుంచి ఎలాంటి ప్రకటన రానుందో. అన్నట్టు, 'ఇజం' ఆడియో విడుదల వేడుకకు ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరు కానున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?