‘కోన’తో ఇక కటీఫ్ ?

కోన వెంకట్ టాలీవుడ్ లో తెలివైన వ్యక్తుల్లో ఒకరు. కేవలం తన మాటకారితనం, తన సంబంధాలు ఉపయోగించి సినిమాలు సెట్ చేసి,  ప్లాన్ చేసి, తన బ్యానర్ యాడ్ చేసి, అంతో ఇంతో వాటా…

కోన వెంకట్ టాలీవుడ్ లో తెలివైన వ్యక్తుల్లో ఒకరు. కేవలం తన మాటకారితనం, తన సంబంధాలు ఉపయోగించి సినిమాలు సెట్ చేసి,  ప్లాన్ చేసి, తన బ్యానర్ యాడ్ చేసి, అంతో ఇంతో వాటా తీసుకునే వ్యవహారం ఆయనది.

ఇదో తరహా. అందులో తప్పేం లేదు. కానీ ఆయన అలా సెట్ చేస్తున్న ప్రాజెక్టులు ఏవీ ప్రామిసింగ్ గా వుండడం లేదు. అదే సమస్య. ఆయన ప్రాజెక్టుల ఖాతాలో చాలా ఫెయిల్యూర్స్ వున్నాయి. ఆ జాబితా అలా పెరుగుతూ వస్తోంది.

పండగ చేస్కో తరువాత ఆయన ప్రమేయం వున్న సినిమాల్లో కాస్త పేరు నిలబెట్టింది నిన్ను కోరి మాత్రమే. గతంలో ఆయన బ్యానర్ లోనే వచ్చిన, లేదా ఆయన బ్యానర్ యాడ్ చేసిన, లేదా ఆయన ప్రమేయం వున్న సాహసం శ్వాసగా సాగిపో…శంకరాభరణం, సౌఖ్యం, బ్రూస్లీ,  డిక్టేటర్, వెంకీ మామ, నిశ్శబ్దం ఇలా ఎన్నో నిరాశపర్చిన సినిమాలు.

ప్రస్తుతం కోన ప్లాన్ చేస్తున్నది కేవలం కరణం మల్లీశ్వరి బయోపిక్ మాత్రమే. మరే ఇతర కమర్షియల్ మూవీ ప్లానింగ్ లో లేవు. పీపుల్స్ మీడియా ఇప్పటికే కోనతో టై అప్ అయి రెండు సినిమాలు చేసింది. ఇక ఇక్కడతో ఆ టై అప్ ఆగిపోయినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. 

బీసీలు ముద్దు..కాపులు వ‌ద్దు