Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొరటాల, మహేష్‌ రూటు మార్చారా.?

కొరటాల, మహేష్‌ రూటు మార్చారా.?

కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తోందంటే, అందులో ఖచ్చితంగా 'మెసేజ్‌' అయితే వుంటుంది. మెసేజ్‌కి కమర్షియల్‌ టచ్‌ ఇవ్వడంలో కొరటాల రూటే సెపరేటు. చేసిన మూడు సినిమాల్లో 'శ్రీమంతుడు' టాప్‌. 'జనతా గ్యారేజ్‌' విషయంలో మాత్రం కొరటాల లెక్కలు తప్పాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం, హీరోయిన్లతో హీరో కెమిస్ట్రీ తక్కువగా వుండడం.. ఇలా చాలా కారణాలే వున్నా, 'జనతా గ్యారేజ్‌'తోనూ నెగెటివ్‌ రిజల్ట్‌ అయితే చూడలేదు కొరటాల. 

ఇక, తన తాజా చిత్రం కోసం కొరటాల కంప్లీట్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌నే ఎంచుకున్నాడని తెలుస్తోంది. మహేష్‌తో రూపొందనున్న ఈ సినిమా తాజాగా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమయ్యింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ప్రారంభోత్సవానికి మహేష్‌ హాజరు కాలేదనుకోండి.. అది వేరే విషయం. ప్రస్తుతం మహేష్‌, మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. 

మహేష్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా మాంఛి కమర్షియల్‌ ఫార్మాట్‌ని సిద్ధం చేసుకున్న కొరటాల, 'శ్రీమంతుడు' కంటే పెద్ద హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడట. అయితే, అండర్‌ కరెంట్‌గా మెసేజ్‌ మాత్రం తప్పదన్నది కొరటాల క్యాంప్‌ నుంచి వస్తోన్న సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?