నదియ, ఖుష్బూ తర్వాత స్థానం ఆమెదే..?

అత్తారింటికి దారేది సినిమాతో నదియాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఆ సినిమా ఆమె జాతకాన్నే మార్చేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలతో నదియా బిజీ స్టార్ అయింది. Advertisement…

అత్తారింటికి దారేది సినిమాతో నదియాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఆ సినిమా ఆమె జాతకాన్నే మార్చేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలతో నదియా బిజీ స్టార్ అయింది.

నదియ తర్వాత ఖుష్బూపై కన్నేశాడు త్రివిక్రమ్. పవన్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం ఖుష్బూను తీసుకున్నాడు. ఈమె కూడా మరోసారి తెలుగులో చక్రం తిప్పుదామని భావించింది. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ తో ఖుష్బూ ఆశలు నెరవేరలేదు.

ఇప్పుడు త్రివిక్రమ్ మరో హీరోయిన్ పై కన్నేశాడు. మొన్నటివరకు హీరోయిన్ పాత్రల్లో మెప్పించి, తన నటనతో నంది అవార్డులు సైతం అందుకున్న లయను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మార్చే పనిలో పడ్డాడట త్రివిక్రమ్.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్రకు లయను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం మేకర్స్ కు లయకు మధ్య చర్చలు సాగుతున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న హీరో పాత్ర తర్వాత ఈ పాత్రే అత్యంత కీలకమైనదని తెలుస్తోంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 40కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన లయ.. 2010 తర్వాత మూవీస్ చేయడం మానేసింది. అలా ఏడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడానికి రెడీ అవుతోంది.