Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆమె శ్రీదేవి కాదు.. అతిలోకసుందరికి అవమానం

ఆమె శ్రీదేవి కాదు.. అతిలోకసుందరికి అవమానం

ఈ ఫొటో చూశారా.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు ప్రతిమ ముందు ఆమె భర్త బోనీకపూర్, ఇద్దరు కపూర్లు కలిసి దిగిన ఫొటో ఇది. ఈ ఫొటో చూసిన వాళ్లకు ఎవరికైనా వెంటనే ఓ అనుమానం చప్పున కలుగుతుంది. అరె.. శ్రీదేవి ఏంటి అలా ఉంది అనేగా మీ అనుమానం. మీ డౌట్ నిజమే.. శ్రీదేవి మైనపు ప్రతిమను తయారుచేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు. ఆ బొమ్మను చూస్తే ఎవ్వరూ శ్రీదేవి అనుకోరు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం.. మైనపు ప్రతిమలకు కేరాఫ్ అడ్రస్. జీవకళ ఉట్టిపడేలా స్టార్స్, సెలబ్రిటీస్ మైనపు ప్రతిమల్ని తయారుచేయడం ఈ సంస్థ ప్రత్యేకత. వీళ్లు తయారుచేసే మైనపు విగ్రహాలు ఎలా ఉంటాయంటే.. అచ్చం ఆ మనుషుల్నే తీసుకొచ్చి నిలబెట్టినట్టు ఉంటాయి. మాధురీదీక్షిత్, ఐశ్వర్యరాయ్, షారూక్, సల్మాన్... ఇలా ఒకరిద్దరు కాదు, ఎంతోమంది మైనపు ప్రతిమలు సజీవరూపం దాల్చుకున్నాయి అక్కడ.

అంతెందుకు రీసెంట్ గా ఇదే మ్యూజియం మహేష్ మైనపు ప్రతిమను కూడా ఆవిష్కరించింది. ఏఎంబీ మాల్ లో సందర్శనార్థం ఉంచిన మహేష్ మైనపు బొమ్మ చూసి చాలామంది నోరెళ్లబెట్టారు. మహేష్ కూతురు సితార అయితే కాసేపు షాక్ కు గురైంది కూడా. అంతలా ప్రాణప్రతిష్ట పోసుకుంటాయి "టుస్సాడ్స్" విగ్రహాలు. కానీ శ్రీదేవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ మేజిక్ మొత్తం మిస్ అయింది. ఆమె విగ్రహం చూస్తే శ్రీదేవిని చూసిన ఫీలింగ్ కలగడం లేదు.

ఇలాంటి బొమ్మలు తయారుచేసే ముందు టుస్సాడ్స్ నుంచి ఓ బ్యాచ్ దిగుతుంది. సదరు స్టార్ కొలతల్ని దగ్గరుండి తీసుకుంటుంది. కనుగుడ్డు, జుట్టు నుంచి ప్రతి అంశాన్ని రికార్డు చేసుకొని వెళ్తారు. ఆ తర్వాత బొమ్మను తయారుచేస్తారు. శ్రీదేవి విషయంలో ఇది మిస్ అయింది. భౌతికంగా కొలతలు తీసుకోవడానికి ఆమె లేరు. అందుకే ఈ సమస్య వచ్చింది. ఉన్నతంలో కళ్లు, ముక్కు తీర్చిదిద్దిన టెక్నీషియన్లు... బుగ్గలు, దవడ, గడ్డం విషయంలో మాత్రం తప్పులు చేశారు. దీంతో ముమ్మూర్తులా శ్రీదేవిని చూసిన భావన ఎవరికీ కలగడంలేదు.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?