మహేష్ బాకీ తీర్చేసుకుంటున్నాడా?

మరి కొద్ది సేపట్టలో జరిగే అఖిల్ సినిమా అడియో ఫంక్షన్ ఒక్కసారిగా క్రేజ్ ను సంతరించుకుంది. దీనికి కారణం మరేమీ లేదు. సూపర్ స్టార్ మహేష్ ఈ ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరుకానుండడమే. నిజంగా…

మరి కొద్ది సేపట్టలో జరిగే అఖిల్ సినిమా అడియో ఫంక్షన్ ఒక్కసారిగా క్రేజ్ ను సంతరించుకుంది. దీనికి కారణం మరేమీ లేదు. సూపర్ స్టార్ మహేష్ ఈ ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరుకానుండడమే. నిజంగా ఇది ఎవరూ ఊహించని టర్నింగ్ పాయింట్. పవన్ హాజరవుతాడని అనుకున్నారంతా. మరోపక్క అఖిల్ కామెంట్లు కూడా ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. 

మహేష్ వస్తే తనకు చాలా ఆనందమే కానీ, అమ్మానాన్న అడియో లాంచ్ చేస్తే బాగుంటుందన్నది తన అభిప్రాయం అన్నాడు అఖిల్. సరే ఈ విషయం పక్కన పెడితే సాధారణంగా వేరే ఫంక్షన్లకు దూరంగా వుండే మహేష్ ఈ ఫంక్షన్ కు ప్రత్యేకించి ఎందుకు వస్తున్నట్లు? దీనికి ఓ రీజన్ వినిపించేస్తోంది అప్పుడే. మహేష్ తొలిసినిమా రాజకుమారుడు అడియోను విడుదల చేసింది నాగార్జున. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ లతో వున్న సాన్నిహిత్యంతో అప్పట్లో నాగ్ ఆ ఫంక్షన్ కు హాజరయ్యాడు. 

అంతే కాదు కృష్ణ ఫ్యామిలీతో మంచి రాపో వుంది అక్కినేని కుటుంబానికి. నాగేశ్వరరావు, కృష్ణ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పైగా ఇద్దరు కలిసి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ చిత్రాలు కూడా చేసారు. పైగా నాగ్-కృష్ణ కలిసి ఓ సినిమాలో నటించారు. మొత్తం మీద ఈ విధంగా మహేష్ తన కుటుంబంతో ఆ కుటుంబానికి వున్న స్నేహాన్ని, తను అడియో విడుదల చేసినందుకు కృతజజ్ఞతను చాటుతున్నాడన్నమాట,. .