Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమా వివాదం కొలిక్కి?

మహేష్ సినిమా వివాదం కొలిక్కి?

మహేష్-వంశీ పైడిపల్లి వివాదం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారం సీరియస్ కావడం, కంటెప్ట్ ఆఫ్ ది కోర్టు పిటిషన్ దిశగా నిర్మాత పీవీపీ కదలడం, గురువారం (21) అఫిడవిట్ దాఖలు చేయాల్సి వుండడంతో, నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, హీరో మహేష్ బాబు దిగిరాక తప్పలేదు. ఈ మేరకు నిర్మాత పీవీపీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది.

బుధవారం సిటింగ్ వేసి, వివాదాన్ని ఎమికబుల్ గా పరిష్కరించుకుందామని దిల్ రాజు నేరుగా కబురు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెహ్రాడూన్ లో వున్న దిల్ రాజు బయలుదేరి హైదరాబాద్ వస్తారు. ఆయన, మరో నిర్మాత అశ్వనీదత్ కలిసి పీవీపీతో చర్చించి, బుధవారం సాయంత్రానికి ఓ ఒప్పందానికి వచ్చి, గురువారంనాడు కోర్టుకు ఆ విషయం తెలియచేసే అవకాశం వుంది.

ఇరు వర్గాలకు సన్నిహితుడు అయిన నిర్మాత కమ్ లీగల్ అడ్వయిజర్ నిరంజన్ రెడ్డి సయోధ్య యత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ వివాదం ఓ కొలిక్కి తెచ్చకోవడం అన్నది అందరికన్నా హీరో మహేష్ కు అవసరం. దానివల్ల బ్రహ్మోత్సవం తలకాయనొప్పి, పీవీపీకి మరో సినిమా చేయాల్సిన అవసరం, వంశీ పైడిపల్లి కథ వివాదం అన్నీ ముగిసిపోతాయి.

ఏ సంగతీ బుధవారంలోపు తెలిసిపోతుంది. ఎందుకంటే గురువారం నాడు చెన్నయ్ కోర్టులో అఫిడవిట్ లు దాఖలు చేయాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?