Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌ కంటే ముందు ఎన్టీఆర్‌తో?

మహేష్‌ కంటే ముందు ఎన్టీఆర్‌తో?

మహేష్‌బాబుతో నాగార్జున కలిసి నటించబోతున్నారని, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మణిరత్నం సినిమా తీస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మణిరత్నం, మహేష్‌, నాగార్జున ఖరారు చేయకపోయినా కానీ మీడియానే ఈ చిత్రానికి ముహూర్తం డేట్స్‌ కూడా ఫిక్స్‌ చేసేస్తోంది. 

మహేష్‌, నాగ్‌ కాంబినేషన్‌ ఎప్పటికి తెరమీదకి వస్తుందనేది తెలీదు కానీ... దాని కంటే ముందు ఎన్టీఆర్‌, నాగార్జునతో ఒక సినిమా చేయాలని దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రయత్నిస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ‘ఎవడు’ విజయం తర్వాత వంశీ పైడిపల్లి మరోసారి తన ‘బృందావనం’ హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు. 

ఎన్టీఆర్‌ ఇప్పుడు బిజీగా ఉన్నా కానీ పైడిపల్లి చెప్పిన లైన్‌ అయితే అతనికి నచ్చిందట. ఇందులో కీలకమైన మరో పాత్రకి నాగార్జున అయితే బాగుంటాడని డైరెక్టర్‌ భావిస్తున్నాడట. ఇంకా నాగార్జునని వంశీ పైడిపల్లి సంప్రదించలేదు కానీ త్వరలోనే అది జరగొచ్చునట. సోలో హీరోగా ఎదురైన పరాజయాలతో నాగార్జున మల్టీస్టారర్స్‌ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడనేది తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కార్యరూపం దాలిస్తే మల్టీస్టారర్స్‌ ట్రెండ్‌ ఊపందుకుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?