Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌బాబు 'కోటరీ' మార్చేశాడట

మహేష్‌బాబు 'కోటరీ' మార్చేశాడట

'బ్రహ్మోత్సవం' ఎఫెక్ట్‌తో మహేష్‌ కోటరీ మారిపోయిందంటూ టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తోంది. ఈ కోటరీలో ఇప్పటిదాకా ఎవరున్నారు.? అన్న విషయానికొస్తే, అందులో ఎక్కువగా మహేష్‌ భార్య నమ్రత సన్నిహితులే వున్నారని టాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. మహేష్‌బాబు నిర్మాతగా మారడం వెనుక నమ్రత ప్రోత్సాహం సుస్పష్టం. నిర్మాణ వ్యవహారాలన్నీ ఆమే స్వయంగా చూసుకుంటున్న విషయం విదితమే. 

శ్రీకాంత్‌ అడ్డాలతో మహేష్‌కి తొలి సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా ఆశించినంత గొప్ప ఫలితం ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ, అప్పటికి ఏదో అలా కొట్టుకుపోయిందది. ఆ లెక్కన శ్రీకాంత్‌ అడ్డాలదే 'బ్రహ్మోత్సవం' వైఫల్యం వెనుక ప్రధాన పాత్ర.. అని అంతా అనుకున్నా, 'బ్రహ్మోత్సవం' సినిమాని మహేష్‌ కోటరీ చివరి నిమిషంలో బాగా కెలికేసిందన్న ప్రచారమూ లేకపోలేదు. 

ఇక, ఈ కారణంగానే మహేష్‌ 'కోటరీ'ని మార్చాడనీ, భార్య నమత్రను సైతం ఇక నుంచి కథ విషయంలో జోక్యం చేసుకోవద్దని మహేష్‌ సూచించాడనీ తెలుస్తోంది. నిర్మాణ వ్యవహారాలో మాత్రం నమ్రత యధావిధిగా తన పాత్రను కొనసాగిస్తుందట. ప్రస్తుం మహేష్‌ - మురుగదాస్‌ దర్శకత్వంలో నటించే సినిమా సెట్స్‌పైకి రానుంది. మురుగదాస్‌ సినిమా కావడంతో దీనిపై కోటరీల ఎఫెక్ట్‌ వుండకపోవచ్చు. 

ఇదిలా వుంటే, కోటరీ వైఫల్యం ఏమీ లేదనీ, 'శ్రీమంతుడు' సినిమా టైమ్‌లో కోటరీ వుంది కదా.. అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. సక్సెస్‌ వచ్చినప్పుడు పునరాలోచించుకోవడానికేముంటుంది.? ఫెయిల్యూర్‌ వచ్చాకనే కదా, ఎక్కడ దెబ్బకొట్టిందో చూసుకునేది.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?