Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మాస్ సినిమాపై మహేష్ కన్ను?

మాస్ సినిమాపై మహేష్ కన్ను?

సూపర్ స్టార్ మహేష్ బాబు మనసు మార్చుకున్నారా..శ్రీమంతుడు తరువాత బ్రహ్మోత్సవం చేయాలని అనుకున్నారు. ముందుగా ప్లాన్ చేసిన త్రివిక్రమ్ ను వెనక్కుపెట్టారు. నిజానికి ఈ నిర్ణయం మహేష్ అభిమానులకు కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అభిమానులు సహజంగా తమ హీరోను మాస్ మసాలా సినిమాలలో నటించాలనుకుంటారు. కానీ మహేష్ ఓ క్లాస్ డైరక్టర్ ను క్లాస్ సినిమాను ఎంచుకున్నారు. 

ఇప్పటికే సినిమా ఎలా వుంటుందన్నది తెలియకున్నా, శ్రీమంతుడు టైటిల్ క్లాసే. కానీ ఇప్పుడు మహేష్ పునరాలోచనలో పడ్డారని వినికిడి. బ్రహ్మోత్సవం కన్న ముందు మాస్ సినిమా చేయడం కానీ, లేదా దాంతో సమాంతరంగా మాస్ సినిమా చేయడం కానీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వివి వినాయక్ లేదా పూరి జగన్నాధ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు బోగట్టా. 

అయితే ఇక్కడ పూరి కన్నా వినాయక్ కే ఎక్కువ చాన్స్ లు వున్నాయి. ఎందుకంటే పూరితో పోల్చుకుంటే వినాయక్ కు ఫెయిల్యూర్ లు తక్కువ. శ్రీమంతుడు మంచి రిజల్ట్ ఇస్తే, బ్రహ్మోత్సవం షెడ్యూలు ప్రకారం ముందుకు వెళ్తుంది. లేదంటే దాన్ని కాస్త ఆపే అవకాశం వుంది. మహేష్ మనసు మార్చుకుంటున్నట్లు వదంతులు వినరావడంతో దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన నితిన్ ప్రాజెక్టుపై కాస్త నిదానంగా  వున్నారని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?