Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముమ్మాటికీ అడ్డాలదేనా తప్పు?

ముమ్మాటికీ అడ్డాలదేనా తప్పు?

బ్రహ్మొత్సవం సినిమాకు సంబంధించి బాధ్యత అంతా తనదే అని మహేష్ బాబు అంటే అని వుండొచ్చు గాక..అది అతని సంస్కారం అయితే అయి వుండొచ్చు గాక, కానీ శ్రీకాంత్ అడ్డాల కూడా కాస్త డిఫరెంట్ గా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. లైన్ ను మహేష్ ఒకె చేసిన తరువాత ఎంత సమయానికీ శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయాడని వినికిడి. 

నిర్మాత ఎంత వెంటపడినా, ఇదే పరిస్థితి కొనసాగిందని వినికిడి. భారీ ఖర్చు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లను దృష్టిలో పెట్టుకుని, చకచకా కథ సరైన విధంగా లాక్ చేయాలని నిర్మాత కోరినా ఫలితం లేకపోయిందని వినికిడి. ఈ వార్తలు ఇప్పుడు మాత్రమే వినరావడం లేదు. బ్రహ్మోత్సవం సినిమా నిర్మాణంలో వుండగానే కథ విషయంలో చాలా గ్యాసిప్ లు వినిపించాయి. 

కథ సరిగ్గా రెడీ చేయలేదని, మహేష్ కూడా ఒకటికి రెండు సార్లు పదే పదే చేప్పాడని అప్పట్లో వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు వినిపిస్తున్న నిర్మాత బాధలు అప్పటి గ్యాసిప్ లను మరోసారి గుర్తు చేస్తున్నాయంతే. ఒక్కోసారి మధ్యాహ్నం పన్నెండు వరకు సెట్ లోనే ఆ రోజు సీన్లు శ్రీకాంత్ ప్రిపేర్ చేసేవాడట. దాంతో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తలపట్టుకున్న సంఘటనలు కూడా వున్నాయని వినికిడి. 

అయితే శ్రీకాంత్ తొలుత ఎన్టీఆర్ కు వినిపించిన కథకు, ఇప్పుడు తెరపైకి వచ్చిన కథకు చాలా అంటే చాలా తేడా వుందని కూడా తెలుస్తోంది. చెప్పిన కథను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు శ్రీకాంత్ అని కథ తెలిసిన వారు అంటున్నారు. కథ, లైన్ బాగుండబట్టే మహేష్, పివిపి ఓకె చేసి వుంటారని, కానీ సినిమా సమర్థవంతగా తీయగలడు అని వారు పెట్టకున్న నమ్మకం మాత్రం వమ్మయిందని అంటున్నారు. 

మరి ఇవన్నీ వింటూ వుంటే, బ్రహ్మోత్సవం పరాజయానికి కారణం శ్రీకాంత్ నే కావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?