Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైలంట్ గా సినిమా చేసేసారు

సైలంట్ గా సినిమా చేసేసారు

అభిరుచిగల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్. వైవిధ్యమైన కథల కోసం చూస్తుంటారు. అలాంటి కథ, అలాంటి దర్శకుడు దొరికారు. గుట్టుచప్పడు కాకుండా సినిమా తీసేసారు. మరో అయిదురోజులు షూట్ చేస్తే సినిమా పూర్తయిపోతుంది.

తెలుగువారికి కూడా సుపరిచితమైన మలయాళ దర్శకుడు ఐవి శశి. అతని కుమారుడు అని శశి కూడా దర్శకుడే. ఈ యంగ్ దర్శకుడు తెలుగులో ఎంటర్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కథ పట్టుకుని ఒకటి రెండు సంస్థలను సంప్రదించాడు. కానీ వాళ్లకు ఆ కథ నచ్చలేదు. అదే కథను నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ఓకె చేసారు. లండన్ నేపథ్యంలో ఓ ప్యాకేజ్ కింద పెద్దగా రిస్క్ లేకుండా ఈ ప్రాజెక్టును టేకప్ చేసారు.

తమిళ హీరో అశోక్ సెల్వన్ తో పాటు నిత్యామీనన్, రీతూ వర్మ కీలక పాత్రలు. లావుగా వున్న హీరో సన్నగా కావడం లాంటి కాన్సెప్ఠ్ తో కూడిన సినిమా అని తెలుస్తోంది. ఇటు తెలుగుతో పాటు, అటు తమిళ,, మలయాళ భాషల్లో ఈ సినిమా తయారవుతోంది.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?