ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది.. ప్రశ్నలు మాత్రం మిగిలాయి

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ స్వయంగా ప్రకటించాడు. ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ, బసవతారకం పాత్ర పోషిస్తున్న…

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ స్వయంగా ప్రకటించాడు. ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ, బసవతారకం పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఇవన్నీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకు సంబంధించిన సన్నివేశాలే.

ఫస్ట్ షెడ్యూల్ అయితే ముగిసింది కానీ, ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు మాత్రం అలానే ఉండిపోయాయి. వాటికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయడంలేదు యూనిట్. వీటిలో అతి ముఖ్యమైనది రెండు భాగాలుగా వస్తున్న బయోపిక్.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతోందనే మేటర్ దాదాపు నిజం. కానీ ఈ విషయాన్ని క్రిష్ ఇప్పటివరకు నిర్థారించలేదు. సంక్రాంతి నాటికి తొలిభాగాన్ని విడుదల చేసి, అది హిట్ అయితే రెండోభాగం తీయొచ్చనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీలేదు.

మరోవైపు ఈ సినిమాలో రకుల్, నాగచైతన్య లాంటి వాళ్లను తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఓ కీలకపాత్రలో మోక్షజ్ఞ కూడా కనిపిస్తాడనే రూమర్ ఉంది. వీటిపై కూడా యూనిట్ నుంచి ఎలాంటి స్పష్టతలేదు. అటు పార్ట్-1లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని టచ్ చేయబోతున్నారా లేదా అనే అంశం కూడా అస్పష్టంగానే ఉంది. ఇవన్నీ ఒకెత్తయితే, అసలు తేజ రాసిన ఈ స్క్రీన్ ప్లేలో క్రిష్ ఎలాంటి మార్పులు చేశాడనేది మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.

ఇలా బయోపిక్ కు సంబంధించి చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వీటికి సమాధానాలు ఇవ్వకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు క్రిష్.