ఓంకార్ కు దండం పెట్టేసా -నాగ్

రాజుగారి గది 2సినిమా వారం క్రితం మీట్ పెడితే, తాను తప్ప ఎవ్వరూ రాలేదని, ఇప్పుడు, హిట్ అవుతుందని నమ్మకం కుదరడంతో, నటులు అంతా మీట్ కు వచ్చారని అన్నాడు హీరో నాగార్జున. Advertisement…

రాజుగారి గది 2సినిమా వారం క్రితం మీట్ పెడితే, తాను తప్ప ఎవ్వరూ రాలేదని, ఇప్పుడు, హిట్ అవుతుందని నమ్మకం కుదరడంతో, నటులు అంతా మీట్ కు వచ్చారని అన్నాడు హీరో నాగార్జున.

రాజుగారి గది 2 ప్రీ రిలీజ్ మీట్ కు హాజరయిన నాగార్జున మాట్లాడుతూ, డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి వుందని, తన పెర్ ఫెక్షన్ తో మొత్తం అందరినీ చంపేసాడని, దాదాపు దెయ్యాలు అయిపోయాం అని నాగ్ చమత్కరించారు. ఆ బాధ పడలేక, చివరికి, షూటింగ్ ఆఖరి రోజు ఓంకార్ కు దండం పెట్టేసానని అన్నారు నాగ్.

సమంత తన ఇంటికి కోడలిగా వచ్చి వారం రోజులే అయిందని, అందువల్ల ఈ సినిమా హిట్ అయితే, కోడలు వచ్చి హిట్ తెచ్చిందని చెప్పుకుంటా అని నాగ్ అన్నారు. అంతే కాదని, తాను సమంతకు పెద్ద అభిమానిని అని, ఏమాయ చేసావె సినిమా టైమ్ లో ఫొన్ చేసి అదే చెప్పానని నాగ్ గుర్తు చేసుకున్నారు. 

సమంత చాలా తెలివినైనది అని, రాజుగారి గది 2 సినిమా ఒప్పుకునేటపుడు, ఆమె పైకి చెప్పకున్నా, యూనిట్ తనను ఆ విధంగానే గౌరవంగా చూస్తుందని ఆమెకు తెలుసు అని, అందుకే ఈ సినిమా చేసి వుంటుందని నాగ్ అన్నారు.

గ్లిజరన్ వాడలేదు-సమంత

పెళ్లి తరువాత తొలిసారి మీడియ ముందుకు వచ్చింది హీరోయిన్ సమంత. రాజుగారి గది 2 ప్రీ రిలీజ్ మీట్ కు హాజరయింది. ఈ సమావేశంలో మాట్లాడిన వాళ్లు, సమంత కూడా ఆమె పాత్ర గురించి చాలా బాగా చెప్పుతూ వచ్చారు. ఈ సినిమాలో తన పాత్ర నేపథ్యం తనను కదలించి వేసిందని, ఈ సినిమాలోని విషాద సన్నివేశాలు ఎక్కడా గ్లిజరిన్ వాడడం లేదని, కన్నీళ్లు వాటంతట అవే వచ్చేవని అన్నారు.

అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చానని, ఇప్పుడు తనకు కొన్ని బాధ్యతలు, బరువులు వుంటాయని, వాటిని గౌరవిస్తానని సమంత అన్నారు.