Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం..చార్మి

పాపం..చార్మి

మనకు పనికిరానివి..మనకు అవసరంలేనివి..గ్రక్కున విడువంగ వలయు గదరా అన్నాడు సుమతీకారుడు. పూరి జగన్నాధ్ ఈ విషయాన్ని బాగానే ఔపాసన పట్టినట్లున్నాడు. జ్యోతిలక్ష్మి సినిమా సందర్భంలోనూ, అంతకు ముందు చాలా కాలంగా చార్మి పక్కన లేని పూరి కనిపించలేదు. జ్యోతిలక్ష్మికి మరో మెట్టుపైకి ఎక్కి ప్రొడక్షన్ లో కూడా కాళ్లు వేళ్లు పెట్టేసింది. అదీ కాక,పూరి ఆఫీసు ఆడ్మినిస్ట్రేషన్ కూడా ఆమే చూసిందని వదంతులు వినవచ్చాయి. 

తీరా నితిన్ సినిమా ఉదంతంతో ఒక్కసారి చేంజ్ వచ్చేసింది. పూరికి కనుచూపు మేరలో లేకుండా చార్మి మాయమైంది. పూరి బుద్దిగా వరుణ్ తేజ సినిమా చేసుకుంటున్నాడు రాజస్థాన్ లో. పైగా ఆ సినిమా ఓపెనింగ్ కు పూరి భార్యా సమేతంగా వచ్చాడు. జ్యోతిలక్ష్మి టీమ్ నే వరుణ్ తేజ సినిమాకు పనిచేస్తుందన్న నిర్మాత సి కళ్యాణ్ కూడా సైలెంట్ అయ్యాడు. 

ఇంతటి ఛేంజ్ కు కారణాలు రెండని టాలీవుడ్ గుసగుసల సారాశం. ఒకటి పూరికి గురువు రామ్ గోపాల్ వర్మ చేసిన హిత బోధ. రెండు పూరికి వున్న డబ్బుల అవసరం అని టాక్. పూరికి ఇప్పుడు డబ్బుల అవసరం చాలా వుందంట. అందువల్ల లేని పోని వ్యవహారాలు నెత్తిన పెట్టుకుని, నితిన్ సినిమా మాదిరి పాడుచేసుకోకుండా, చకచకా సినిమాలు చేయడం చాలా అవసరం అని టాక్. ప్రస్తుతానికి బ్రహ్మొత్సవం తప్ప వేరేది కమిట్ కాలేదు మహేష్. ఇప్పుడు వరుణ్ తేజ సినిమా హిట్ అయితే పూరి కి ఆటోమెటిక్ గా డేట్లు దొరికేస్తాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?