పాతలెక్కలు తీస్తున్న ‘కౌన్సిల్’ ?

నిర్మాత టాగోర్ మధు రెమ్యూనిరేషన్ సుమారుగా 12 లక్షలు, జిఎస్టీ 13 లక్షలు బకాయి పడ్డారని, వాటిని ఇప్పించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని కౌన్సిల్ గుమ్మం తొక్కారు.  Advertisement అది కాస్తా బయటకు వచ్చింది.…

నిర్మాత టాగోర్ మధు రెమ్యూనిరేషన్ సుమారుగా 12 లక్షలు, జిఎస్టీ 13 లక్షలు బకాయి పడ్డారని, వాటిని ఇప్పించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని కౌన్సిల్ గుమ్మం తొక్కారు. 

అది కాస్తా బయటకు వచ్చింది. అయితే కౌన్సిల్ ఈ పంచాయతీ తేల్చడానికి ముందు వేరే పంచాయతీలు కూడా తేల్చాల్సి వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో నిర్మాతలు భగవాన్ పుల్లారావులకు సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు. 

ఆ అడ్వన్స్ వెనక్కు ఇవ్వాలని ఆ నిర్మాతలు అప్పట్లోనే కౌన్సిల్ కు ఎక్కారు. కానీ ఆ వివాదం ప్రతిసారి అజెండాల్లోకి వస్తోంది. వెనక్కు వుంటొంది. అలాగే గోపీచంద్ కు లింక్ వున్న మరొ ఒకటి రెండు వ్యవహారాలు కూడా కౌన్సిల్ దగ్గర పెండింగ్ లో వున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

అందువల్ల ఇప్పుడు ఎలాగూ టైమ్ వచ్చింది కాబట్టి, కౌన్సిల్ దగ్గర పెండింగ్ వున్నగోపీచంద్ తో సంబంధం వున్నఅన్నీ ఒకేసారి పరిష్కరించాలని కౌన్సిల్ ఆలోచిస్తోందని తెలుస్తోంది.

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్