పవన్ సినిమా మైత్రీతోనే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాతి సినిమా మీద క్లారిటీ వచ్చేసింది. ఆయన తన తరువాతి సినిమాను మైత్రీ మూవీస్ కే చేస్తున్నారట. కందిరీగ, రభస వంటి సినిమాలు అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు.…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాతి సినిమా మీద క్లారిటీ వచ్చేసింది. ఆయన తన తరువాతి సినిమాను మైత్రీ మూవీస్ కే చేస్తున్నారట. కందిరీగ, రభస వంటి సినిమాలు అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ మేరకు స్క్రిప్ట్ దాదాపు లాక్ స్టేజ్ కు చేరుకుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మైత్రీ మూవీస్ సంస్థ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తోంది. త్వరలో నాగ్ చైతన్య-చందు మొండేటి సినిమా స్టార్ట్ చేస్తారు. ఆ సినిమా పూర్తిస్తాయి షెడ్యూలు చైతూ పెళ్లి తరువాతే వుంటుందని తెలుస్తోంది. ఈలోగా ఓ చిన్న షెడ్యూలు చేసి వదిలే అవకాశం వుంది.

త్రివిక్రమ్ సినిమా కాగానే పవన్ సినిమా స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఈసారి తన సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా స్క్రిప్ట్, నిర్మాతలు రెడీగా వున్నారు.

అయితే ఎఎమ్ రత్నం సినిమా ఏమయిందన్నది పక్కాగా తెలియడం లేదు. అడ్వాన్స్ తిరిగి ఇచ్చారని, లేదు, సినిమా వుంటుందని టాక్ వినిపిస్తోంది. మొత్తంమీద త్రివిక్రమ్ సినిమా తరువాత అయితే ఎఎమ్ రత్నం సినిమా లేదన్నది పక్కా.