పూరి జగన్నాథ్‌ కావాలనే చేస్తున్నారా?

హీరో బాలకృష్ణ తో పైసా వసూల్ సినిమా ఓపెనింగ్ అప్పుడే చెప్పేసాడు దర్శకుడు పూరిజగన్నాధ్ తన సినిమాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని, నేరుగా ఎన్టీఆర్ సినిమా మీదకే వదిలే ఆలోచన చేస్తున్నారు. ఈ…

హీరో బాలకృష్ణ తో పైసా వసూల్ సినిమా ఓపెనింగ్ అప్పుడే చెప్పేసాడు దర్శకుడు పూరిజగన్నాధ్ తన సినిమాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని, నేరుగా ఎన్టీఆర్ సినిమా మీదకే వదిలే ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 22తో సినిమా టాకీ అయిపోతోంది మహా అయితే నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్నా ఆగస్టు నెలాఖరుకు రెడీ అయిపోతుంది.

మహేష్ సినిమా మర్నాడు బాలయ్య సినిమా వేసే కన్నా, ఎన్టీఆర్ సినిమా జై లవకుశ విడుదలకు ఓ రోజు ముందే పైసా వసూల్ విడుదల చేస్తే బెటర్ అని పూరి అంటున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అసలు విషయం వేరే వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

జై లవకుశలో జై క్యారెక్టర్ టైపు క్యారెక్టర్ ను పూరి గతంలో ఎన్టీఆర్ కు చెప్పారు. కానీ ఓకే కాలేదు. కానీ అదే టైపు క్యారెక్టర్ తో ఇప్పుడు సినిమా చేయడం అన్నది పూరి ఇగో ను కాస్త హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ ఆ మధ్య ఈ విషయమై మీడియాకు లీకులు ఇచ్చారు. స్టోరీలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ వాటినేం పట్టించుకోలేదు. 

అందుకే నేరుగా తను బాలయ్యతో చేస్తున్న సినిమాను సెప్టెంబర్ 21న విడుదల చేయించాలని పూరి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బాలయ్య కూడా సుముఖంగానే వున్నట్లు వినికిడి. అంటే తన కథ కాదన్నందుకు ఈ విధంగా పూరి సవాల్ విసురుతున్నారేమో మరి? చూడాలి.