పూరిపై నాగబాబు సీరియస్?

టాలీవుడ్ లో భలే కబుర్లు చక్కర్లు కొడుతుంటాయి. నిజమా కాదా అన్నది పక్కన పెడితే, నమ్మేంతగా వుండడం వీటి స్పెషాలిటీ. దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వరుణ్ తేజ్ సినిమా ప్రకటన ఒకటి…

టాలీవుడ్ లో భలే కబుర్లు చక్కర్లు కొడుతుంటాయి. నిజమా కాదా అన్నది పక్కన పెడితే, నమ్మేంతగా వుండడం వీటి స్పెషాలిటీ. దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వరుణ్ తేజ్ సినిమా ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. సి కళ్యాణ్ నిర్మాత. నితిన్ – పూరి సినిమా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో డ్యామేజీ కంట్రోలుగా ఈ ప్రకటన బయటకు వచ్చిందని అందరూ అనుకున్నారు. 

ఇదిలా వుంటే, ఇలా ప్రకటించడం పట్ల హీరో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు సీరియస్ అయ్యారని వినికిడి. ప్రస్తుతం వరుణ్ తేజ్ కంచె సినిమా చేస్తున్నారు. క్రిష్ దర్శకుడు. ఈ సినిమా అవకుండానే ఆదికి ముందే ఎందకు ప్రకటించారని ఆయన పూరి, కళ్యాణ్ లను అడిగినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. 

పూరి తీసిన జ్యోతిలక్ష్మి రిజల్ట్ చూసిన తరువాత నాగబాబు పునరాలోచనలో వున్నారని, అందుకే ఎందుకు ప్రకటించారని నిలదీసారని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.