Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజ్ తరుణ్ కోసం మళ్లీ ఆ నిర్మాత?

రాజ్ తరుణ్ కోసం మళ్లీ ఆ నిర్మాత?

రాజ్ తరుణ్ మార్కెట్ కు జోష్ తెచ్చిన సినిమా 'సినిమా చూపిస్తా మావా'... ఈ సినిమా నిర్మాత బెక్కం వేణుగోపాల్. దర్శకుడు నక్కిన త్రినాధరావు. ఆ సినిమా హిట్ తరువాత ఆ ఇద్దరినీ దిల్ రాజు హైజాక్ చేసేసారు. వాళ్ల వర్క్, తన పెట్టుబడి అనేటట్లు, నేను లోకల్ సినిమా తీసారు. ఇప్పుడు హలోగురూ ప్రేమకోసమే అనే సినిమా చేస్తున్నారు.

అయితే మళ్లీ మరోసారి బెక్కం వేణుగోపాల్ స్వంతంగా సినిమా చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బెక్కం వేణుగోపాల్ ఓ స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నారు. అయితే మరి ఈ సినిమాకు కూడా నక్కిన త్రినాధరావే వర్క్ చేస్తారా? లేక వేరే డైరక్టర్ తో చేస్తారా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ బ్యాడ్ ఫేజ్ లో వున్నాడు. సరైన సినిమాలతో బౌన్స్ బ్యాక్ కావాలని వెయిట్ చేస్తున్నాడు. అందువల్ల మళ్లీ ఓ చిన్న సినిమాను నాలుగయిదు కోట్లతో అతగాడితో లాగించేయవచ్చు. అందుకే అదే ట్రయిల్స్ లో బెక్కం వేణుగోపాల్ వున్నట్లు వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?