రాంబాబు కష్టాలు తీరినట్లే

డబ్బింగ్ ఆగిపోయి, టెక్నీషియన్లు కోపరేట్ చేయక కిందా మీదా అవుతున్న ఉంగరాల రాంబాబు కష్టాలు గట్టెక్కినట్లే. పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబకు క్రాంతి మాధవ్ దర్శకుడు. Advertisement సునీల్ హీరోగా నటిస్తున్న ఈ…

డబ్బింగ్ ఆగిపోయి, టెక్నీషియన్లు కోపరేట్ చేయక కిందా మీదా అవుతున్న ఉంగరాల రాంబాబు కష్టాలు గట్టెక్కినట్లే. పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబకు క్రాంతి మాధవ్ దర్శకుడు.

సునీల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కొన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కొంది. దీంతో సునీల్, ప్రకాష్ రాజ్ డబ్బింగ్ ఆపేసారని, అలాగే మ్యూజిక్ డైరక్టర్ జిబ్రాన్ రీ రికార్డింగ్ చేయలేదని వార్తలు వచ్చాయి. దీనికి తోడు హీరో సునీల్ తన సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లిపోయారు.

అయితే మొన్నే ఇండియాకు సునీల్ తిరిగివచ్చారు. నిర్మాత పరుచూరి ప్రసాద్, హీరో సునీల్ సమావేశమై సమస్య పరిష్కరించుకున్నట్లు వినికిడి. దీంతో కొద్దిగా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కావడానికి మార్గం సుగమం అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 4న లేదా 18న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.