Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శర్వాకు మంచి డేట్ దొరికేసింది

శర్వాకు మంచి డేట్ దొరికేసింది

శర్వానంద్ రణరంగం అన్ని విధాలా పూర్తయిపోయి విడుదలకు రెడీగా వుంది. జూన్ నుంచి సరైన డేట్ కోసం చూస్తూ, మెల్లగా ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్నారు. ఆగస్టు 2 వేద్దాం అనుకుంటే ముందు డియర్ కామ్రేడ్, వెనుక మన్మధుడు 2 రెడీగా వున్నాయి. దాంతో వేయాలా? వద్దా? సెప్టెంబర్ కు వెళ్లిపోవాలా? అన్న మీమాంసతో వున్నారు. 

ఇప్పుడు ఆ సినిమా నెత్తిన పాలు పోసినట్లు అయింది. బాహుబలి ప్రభాస్ సాహో సినిమా వాయిదా పడడంతో, అర్జెంట్ గా ఆగస్టు 15 విడుదల అని డేట్ ప్రకటించేసారు. కానీ ఇక్కడా సోలో డేట్ దొరకలేదు. పివిపి నిర్మించిన అడవి శేష్ ఎవరు సినిమా కూడా ఇదే డేట్ కు అనౌన్స్ చేసారు.

వాస్తవానికి ఎవరు సినిమా ఆగస్టు 23 అని అనుకున్నారు. అయితే ఎప్పుడయితే ఆగస్టు 15 ఖాళీ అయిందో వెంటనే ఓ వారం ముందుకు వచ్చారు. అయితే జోనర్ లు వేరు, సినిమా సైజ్ వేరు కాబట్టి, సెలవులు కలిసి వచ్చాయి కాబట్టి, రెండు సినిమాలు అయినా చల్తా అనుకోవాలి. శర్వానంద్ రణరంగం సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. సుధీర్ వర్మ దర్శకుడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?